Telangana: కులం, మతం పోయింది.. ఇప్పుడు గోత్రం అడ్డొచ్చింది.. ప్రేమ జంటకు పెద్దల వేదింపులు..!

|

Jun 15, 2022 | 5:47 AM

Telangana: వేరే కులం అని, వేరే మతం అని ఇన్నాళ్లు ప్రేమ పెళ్లిళ్లను అడ్డుకున్నారు. ఇప్పుడు, మరో కారణంతో ప్రేమించి పెళ్లిచేసుకున్న వారిని మనోవేదనకు గురిచేస్తున్నారు పెద్దలు.

Telangana: కులం, మతం పోయింది.. ఇప్పుడు గోత్రం అడ్డొచ్చింది.. ప్రేమ జంటకు పెద్దల వేదింపులు..!
Love Marriage
Follow us on

Telangana: వేరే కులం అని, వేరే మతం అని ఇన్నాళ్లు ప్రేమ పెళ్లిళ్లను అడ్డుకున్నారు. ఇప్పుడు, మరో కారణంతో ప్రేమించి పెళ్లిచేసుకున్న వారిని మనోవేదనకు గురిచేస్తున్నారు పెద్దలు. అవును, ప్రేమించి పెళ్లి చేసుకున్నవారికి ఏళ్లు గడిచినా తిప్పలు తప్పడం లేదు. ఇన్నాళ్లు వేరే కులం అని, వేరే మతం అని ఎన్నో వివాహాలను అడ్డుకున్న పెద్దలు, ఇప్పుడు గొత్రం పేరుతో మనోవేదనకు గురిచేస్తున్నారు. తాజాగా, హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. బేగంబజార్‌లో నివాసం ఉంటున్న కృష్ణ, అశ్విని ప్రేమించుకొని రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. అయితే, ఈ ఇద్దరిది ఒకే గోత్రం కావడంతో సిక్వాల్ బ్రాహ్మన్ సమాజ్ వాళ్లు వీరిద్దరిని బహిష్కరించారు. రెండు సంవత్సరాల నుంచి తల్లిదండ్రులను కూడా కలవనివ్వకుండా షరతులు పెట్టారు సమాజ్ సభ్యులు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన అశ్విని.. సిక్వాల్ బ్రాహ్మన్ సమాజ్ సభ్యులు 12 మందిపై అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అశ్వినీ ఫిర్యాదుతో, ఇరువర్గాల పెద్దలను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు పోలీసులు. ఇద్దరు మేజర్లు కాబట్టి పెళ్లి చేసుకున్నారని, వారిని ఇబ్బందులకు గురిచేస్తే, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.