Watch Video: భారీగా పెరిగి చేపల డిమాండ్.. ఎందుకో తెలుసా.. కిలో ధర ఇలా..

ఖమ్మం జిల్లాలో మృగశిర కార్తె సందర్భంగా స్థానిక ప్రజలు చేపలు కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. మృగశిర కార్తె రోజు చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటామని పూర్వకాలం నుండి నానుడి వినిపోస్తోంది. దీంతో స్థానిక ప్రజలు చేపలను ఎంత ఖరీదైన పెట్టి కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. మండే ఎండల నుంచి ఉపశమనం కలిగించే మృగశిర కార్తె నేటి నుండి మొదలైంది. మృగశిర కార్తెకు వ్యవసాయ పరంగానే కాక, ఆహార, ఆరోగ్య పరంగా కూడా విశేష ప్రాధాన్యం ఉంది. రోహిణి కార్తె వేళ మండే ఎండలతో సతమతమైన ప్రజలు.. తొలకరి జల్లులను మోసుకొచ్చే మృగశిర కార్తె కోసం ఎదురు చూస్తారు.

Watch Video: భారీగా పెరిగి చేపల డిమాండ్.. ఎందుకో తెలుసా.. కిలో ధర ఇలా..
Fish Market
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 08, 2024 | 12:16 PM

ఖమ్మం జిల్లాలో మృగశిర కార్తె సందర్భంగా స్థానిక ప్రజలు చేపలు కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. మృగశిర కార్తె రోజు చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటామని పూర్వకాలం నుండి నానుడి వినిపోస్తోంది. దీంతో స్థానిక ప్రజలు చేపలను ఎంత ఖరీదైన పెట్టి కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. మండే ఎండల నుంచి ఉపశమనం కలిగించే మృగశిర కార్తె నేటి నుండి మొదలైంది. మృగశిర కార్తెకు వ్యవసాయ పరంగానే కాక, ఆహార, ఆరోగ్య పరంగా కూడా విశేష ప్రాధాన్యం ఉంది. రోహిణి కార్తె వేళ మండే ఎండలతో సతమతమైన ప్రజలు.. తొలకరి జల్లులను మోసుకొచ్చే మృగశిర కార్తె కోసం ఎదురు చూస్తారు. కార్తె ప్రారంభం నుంచే వానాకాలం మొదలవుతుంది. తద్వారా భూగర్భజలాల మట్టం పెరిగి నీటి సమస్య తీరుతుందని భావిస్తారు. మృగశిర కార్తెనాడు చేపలను ఆహారంగా తీసుకుంటే శ్వాస కోశ ఇబ్బందులు తొలగుతాయన్న నమ్మకం ప్రజలల్లో బలంగా నాటుకుపోయింది.

దీంతో ఖమ్మంలోని స్థానిక ప్రజలు చేపల కొనుగోళ్లకు ఆసక్తి చూపారు . బొచ్చె, బంగారు తీగ, కట్ల, శీలావతి, తదితర తెల్లచేపలకు డిమాండ్ బాగా పెరిగింది. పైగా వారాంతాలు కావడంతో వ్యాపారులు అధిక ధరలకు విక్రయింస్తున్నారు. ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడంతో స్థానికంగా ఉన్న చెరువులు, రిజర్వాయర్లు, కుంటలు, పూర్తిగా ఎండిపోయాయి. దీంతో చేపలు దొరకక ఇతర ప్రాంతాల నుండి లారీలలో, వ్యాన్లలో వ్యాపారులు చేపలను తీసుకురావల్సి వస్తోంది. అందుకే రవాణా ఛార్జీలను కలుపుకుని అధిక రేట్లకు విక్రయించామని చెబుతున్నారు. మృగశిర వేళ డిమాండును దృష్టిలో ఉంచుకొని చేపలధరలు కిలో రూ.200 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. దీంతో చేపల మార్కెట్లతోపాటు రహదారుల వెంట కొనుగోళ్ల సందడి కనిపించింది. అలాగే పలువురు ఆయుర్వేద వైద్యులు ఉబ్బస రోగులకు చేప పిల్లలను మందుగా పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!