KTR: ‘పోరాటాలు కొత్తేం కాదు.. ప్రతిపక్షంలో ప్రజల గొంతుకై మాట్లాడుతాం’: మాజీ మంత్రి కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి గెలిచిన మాజీ మంత్రి కేటీఆర్ కొన్ని కీలకవ్యాఖ్యలు చేశారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎవరెన్ని రకాలుగా ప్రలోభాలు, కుట్రలు చేసినా ప్రజలు మాత్రం అభివృద్ధికి, సంక్షేమానికే పట్టం కట్టారన్నారు.

KTR: పోరాటాలు కొత్తేం కాదు.. ప్రతిపక్షంలో ప్రజల గొంతుకై మాట్లాడుతాం: మాజీ మంత్రి కేటీఆర్
MLA KTR

Updated on: Dec 06, 2023 | 5:58 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి గెలిచిన మాజీ మంత్రి కేటీఆర్ కొన్ని కీలకవ్యాఖ్యలు చేశారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎవరెన్ని రకాలుగా ప్రలోభాలు, కుట్రలు చేసినా ప్రజలు మాత్రం అభివృద్ధికి, సంక్షేమానికే పట్టం కట్టారన్నారు.

ఎన్నికల్లో ఊహించని ఫలితాలు రావడం సహజం, నిరాశపడాల్సిన అవసరం లేదని.. తామకు పోరాటాలు కొత్తేం కాదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన ప్రజల గొంతుకై మాట్లాడుతామన్నారు. ‘అయ్యో కేసీఆర్ ప్రభుత్వం పోయిందా? అంటూ కాంగ్రెస్ కు ఓటు వేసిన వారు కూడా మెసేజ్ లు పెడుతున్నారని’ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. పవర్ పాలిటిక్స్ లో అధికారం రావడం.. పోవడం సహజం అందుకు నిరాశపడాల్సిన అవసరంలేదని తెలిపారు.

ప్రజలు తమకు రెండు సార్లు అవకాశం ఇచ్చారని.. ఈసారి ఇచ్చిన ప్రతిపక్ష పాత్రలో ప్రజల గొంతుకై మాట్లాడుతామన్నారు. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్, బీఆర్ఎస్ అని తెలిపారు. ప్రజలు తమను వదులుకోరు.. ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని చెప్పుకొచ్చారు. సిరిసిల్లలో ఓటుకు డబ్బులు, ముందు పంచనని మాట ఇచ్చాను. ఆ మాటను నిలబెట్టుకున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us