
వర్షాకాలం సీజన్ స్టార్ట్ కావడంతో రాష్ట్రంలో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా రైతు భరోసా కింద రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయం నిధులను విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. తాజాగా జరిగిన సమావేశంలో జూన్ 30వ తేదీన తొలి విడత రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. మధిరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
అయితే నిధుల పంపిణీలో ఎలాంటి ఆటంకం లేకుండా నేరుగా అర్హులైన రైతులందరి ఖాతాల్లో నిధులు జమ అయ్యేందుకు అధికారులు సరికొత్త వ్యూహాన్ని అమలు చేయనున్నారు. పెట్టుబడి సాయం మొత్తాన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రక్రియను మొత్తం మూడు దశలుగా విభజించి నిధులు విడుదల చేయనున్నారు. ఇది ప్రభుత్వంపై కూడా ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని అధికారులు చెబుతున్నారు.
తొలి విడతలో వీరికే నిధులు:
అయితే తొలి దశలో భాగంగా సన్న, చిన్నకారు రైతులకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది. అంటే కేవలం ఎకరం లేదా ఎకరం లోపల భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ముందుగా నిధులు జమ చేయనుంది. ఇక రెండో విడతలో భాగంగా.. రెండు ఎకరాల సాగు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. ఇక చివరిగా మూడో విడతలో రెండు నుంచి ఐదు ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రైతు భరోసా FAQ..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.