Telangana: తెల్లారి పొలంలో తల లేకుండా కనిపించిన భారీ ఆకారం.. ఏంటా అని వెళ్లి చూడగా

రెండేళ్ల క్రితం చనిపోయిన ఓ యువకుడి సమాధీని తవ్వి ఆ మృతదేహాం తలను‌ మాయం చేశారు గుర్తు తెలియని దుండగులు. మూడు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఓ సారి లుక్కేయండి.

Telangana: తెల్లారి పొలంలో తల లేకుండా కనిపించిన భారీ ఆకారం.. ఏంటా అని వెళ్లి చూడగా
Trending

Edited By:

Updated on: Jan 23, 2026 | 8:32 AM

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఇస్లాంనగర్ గ్రామానికి చెందిన లాండ్గె వెంకట్(19) రెండేళ్ల క్రితం 2024 నవంబర్ 19న వ్యవసాయ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అతని మృతదేహాన్ని సొంత పొలంలోనే పాతిపెట్టి సంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే గత మూడు రోజుల క్రితం ఆ ప్రదేశంలో గుంత తవ్విన ఆనవాళ్లు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు‌ గురయ్యారు. పాతిపెట్టిన మృతదేహానికి చెందిన తల మాయమైనట్టుగా గుర్తించారు కుటుంబ సభ్యులు.

ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన ఇచ్చోడ సీఐ బండారి రాజు కేసు నమోదు‌ చేసుకుని‌ దర్యాప్తు చేపట్టారు. మృతదేహం తల భాగాన్ని ఎవరు ఎత్తుకెళ్లినట్లు..? ఎందుకు‌ ఎత్తుకెళ్లినట్టు.? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆకతాయిల పనా లేక క్షుద్ర పూజల కోసం తలను‌ మాయం చేశారా అన్నది తేలాల్సి ఉంది. గత ఆదివారం పుష్య అమావాస్య కావడం.. అత్యంత ప్రమాదకర అమావాస్య అన్న ప్రచారం నేపథ్యంలో మాంత్రుకులే ఈ దారుణానికి పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏమన్నారంటే.?

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..