AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: మంత్రులతో సీఎం కేసీఆర్‌ సమావేశం.. తాజా రాజకీయ పరిణామాలతోపాటు..

ఇవాళ మంత్రులతో భేటీ కానున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు సమావేశం ఉంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం మంత్రులకు సమాచారం అందించింది. 5 గంటలలోపు ప్రగతి భవన్‌ చేరుకోవాలని మంత్రులకు ఆదేశాలు వెళ్లాయి.

CM KCR: మంత్రులతో సీఎం కేసీఆర్‌ సమావేశం.. తాజా రాజకీయ  పరిణామాలతోపాటు..
Sanjay Kasula
|

Updated on: Jun 10, 2022 | 11:21 AM

Share

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(K.Chandrasekhar Rao) ఇవాళ మంత్రులతో భేటీ కానున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు సమావేశం ఉంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం మంత్రులకు సమాచారం అందించింది. 5 గంటలలోపు ప్రగతి భవన్‌ చేరుకోవాలని మంత్రులకు ఆదేశాలు వెళ్లాయి. శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో జరుగనున్న ఈ సమావేశానికి మంత్రులతోపాటు ఫ్లోర్‌ లీడర్లు హాజరుకానున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై ప్రధానంగా చర్చించనున్నారు. వీటితోపాటు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌పై కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు సీఎం కేసీఆర్. తాజా పరిణామాలు, రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చర్చించనున్నారు.

రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికపై కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన ప్రధాన నేతలతో సీఎం కేసీఆర్‌ సమావేశం అవుతూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి.. మద్దతిచ్చే విషయంలో ఎలా వ్యవహరించాలి.. అనే అంశంపై సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం