Vijayashanthi: టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలపై కేంద్రానికి రిపోర్ట్స్ వెళ్లాయి.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ అరెస్ట్ తీరుపై బీజేపీ సీనియర్ నేత విజయశాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం తీరు సరిగా లేదని మండిపడ్డారు.

Vijayashanthi: టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలపై కేంద్రానికి రిపోర్ట్స్ వెళ్లాయి.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
Vijayashanthi

Updated on: Jan 03, 2022 | 3:59 PM

BJP Senoir Leader Vijayashanthi: బండి సంజయ్ అరెస్ట్ తీరుపై బీజేపీ సీనియర్ నేత విజయశాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం తీరు సరిగా లేదని మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ అడుగడుగునా బీజేపీ నేతలని అడ్డుకుంటున్నారు. ప్రజాసామ్యబద్ధంగా పోరాటం చేసేవారిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. తెలంగాణ ప్రజల కోసం కాదట..కేసీఆర్ కుటుంబం కోసమా..?. మమ్మల్ని హౌజ్ అరెస్టులు చేస్తున్నారు.. 317 జీవో సవరణ చేయాలని బండి సంజయ్ దీక్షకి వెళ్తే అడ్డుకొని అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు ఎవరెవరి మీద కేసులు పెట్టావో అన్నీ విషయాలు కేంద్రానికి తెలుసు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని కుట్ర చేస్తున్నారు. బండి సంజయ్‌తో పాటు కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని విజయశాంతి డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విజయశాంతి ధ్వజమెత్తారు.

బీజేపీ నేతలను సైతం కరీంనగర్ వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డ విజయశాంతి.. ఫోన్లు లాక్కుంటున్నారు.. మీ మీటింగ్‌లకి కరోనా ఉండదా అని ఆమె ప్రశ్నించారు. బీజేపీ మీటింగ్‌లకు కరోనా ఉంటాదా..?. టీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి. ప్రజల తప్పుదారి పట్టించేందుకే బీజేపీ దీక్ష చేసిన రోజే కాంగ్రెస్ చేస్తుందని మండిపడ్డారు. బండి సంజయ్ సందర్భంగా పోలీసులు ప్రవర్తించిన తీరు సరిగా లేదన్న విజయశాంతి.. మహిళల చీరలు లాగారు. కార్యకర్తలను లాఠీలతో కొట్టారని ఆరోపించారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలతో అందరూ బయటకు వస్తున్నారు. సమస్యలను పక్క దారి పట్టిస్తున్నారు. బండి సంజయ్‌తో పాటు, కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని విజయశాంతి డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వల్ల తెలంగాణలో ఎవరు సంతోషంగా లేరు.. రాష్ట్రం చావుల తెలంగాణగా మారింది.. టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలపై కేంద్రానికి రిపోర్ట్స్ వెళ్లాయి.. కేంద్రం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుంది’’ అని .. విజయశాంతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.