
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ(టీబీజేపీ) ఎన్నికల తొలి జాబితా విడుదలైంది. ఫస్ట్లిస్టులో మొత్తం 52 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. ఈ లిస్టుకు బీజెపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఆమోద ముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అయింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బి.ఎల్. సంతోష్తో పాటూ కమిటీ సభ్యులైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, సీనియర్ నేత ఈటల రాజేందర్ ఇందులో పాల్గొన్నారు. ఎన్నికల బరిలోకి దిగేందుకు కేంద్ర కమిటీ 52మందికిపైగా అభ్యర్ధులతో తొలి జాబితాకు ఆమోదముద్ర వేశారు.
వరుస భేటీలు.. వడపోతలు.. అంతకుమించి సుదీర్ఘ కసరత్తు.. వీటన్నింటి తర్వాత తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు బలాలు, బ్యాగ్రౌండ్, సామాజిక సమీకరణాల ప్రాతిపదికగా అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఎంపికలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, జనరల్ అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత దక్కేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఫస్ట్ లిస్ట్తో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. బీసీ కార్డ్తో ఎన్నికలకు వెళ్లాలని.. ఇందులో భాగంగా బీసీ నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తోంది టీబీజేపీ. ఎన్నికల్లో బీసీ నినాదం తమకు తిరుగులేని అస్త్రంగా మారుతుందని లెక్కలేసుకుంటోంది.
BJP releases the first list of candidates for the upcoming Assembly Elections in Telangana.
Party MPs Soyam Bapu Rao fielded from Boath, Arvind Dharmapuri from Koratla and Bandi Sanjay Kumar from Karimnagar.
T Raja Singh to contest from Goshamahal. pic.twitter.com/IkghIilEpM
— ANI (@ANI) October 22, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి