డ్రైవరన్నకు సెల్యూట్.. హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్తుండగా గుండెపోటు.. చివరకు..

వ్యాపారస్తులకు వినియోగదారుడే దేవుడు. అలానే ఆర్టీసీ సిబ్బందికి కూడా ప్రయాణికులే దేవుళ్ళుగా భావిస్తుంటారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ఆర్టీసీ డ్రైవర్ల విధి. అయితే తన విధి ధర్మాన్ని పాటించి చాతి నొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలనే బాధ్యతతో ఉన్నాడు.

డ్రైవరన్నకు సెల్యూట్.. హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్తుండగా గుండెపోటు.. చివరకు..
Apsrtc

Edited By:

Updated on: Jan 26, 2026 | 6:03 PM

వ్యాపారస్తులకు వినియోగదారుడే దేవుడు. అలానే ఆర్టీసీ సిబ్బందికి కూడా ప్రయాణికులే దేవుళ్ళుగా భావిస్తుంటారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ఆర్టీసీ డ్రైవర్ల విధి. అయితే తన విధి ధర్మాన్ని పాటించి చాతి నొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలనే బాధ్యతతో ఉన్నాడు. చివరి నిమిషం వరకు బస్సును సురక్షితంగా రోడ్డు పక్కన ఆపి, ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు ఓ ఆర్టీసీ డ్రైవర్. కానీ చివరికి ఆ ఆర్టీసీ డ్రైవర్ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మధ్యాహ్నం హైదరాబాదు మియాపూర్ నుండి విజయవాడకు బయలు దేరింది. బస్సులు 18 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుండి బయలుదేరినప్పటి నుండి డ్రైవర్ నాగరాజుకు ఛాతిలో నొప్పి వస్తోంది. అయినా చౌటుప్పల్ సమీపంలోకి రాగానే ఛాతీలో నొప్పి ఎక్కువైంది. సాధారణ నొప్పి అనుకుని చివరి నిమిషం వరకు బస్సును సురక్షితంగా నడిపాడు.. ప్రయాణికుల ప్రాణాలను కాపాడే బాధ్యతతో చౌటుప్పల్ వరకు వచ్చాడు. కానీ గుండెలో నొప్పిని ఇక తట్టుకోలేకపోయాడు.. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పక్కకు బస్సును ఆపేశాడు.

వెంటనే ఆటోలో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాడు. కానీ దురదృష్టవశాత్తు డాక్టర్లు లేకపోవడంతో.. ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుని ఆటో డ్రైవర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లాడు. నాగరాజుని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. తమ ప్రాణాలను కాపాడేందుకు ఛాతీ నొప్పితో డ్రైవింగ్ చేసిన నాగరాజు మృతి ప్రయాణికులను కలిసి వేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..