Adilabad Rims: ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఫుడ్‌ పాయిజన్‌.. ఆసుపత్రి పాలైన 23 మంది మెడికోలు..

|

Feb 01, 2021 | 6:37 PM

ఆదిలాబాద్‌లో 23 మంది రిమ్స్ వైద్య విద్యార్థులు అస్వస్థతతకు గురయ్యారు. ఫుడ్‌ పాయిజన్‌..

Adilabad Rims: ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఫుడ్‌ పాయిజన్‌.. ఆసుపత్రి పాలైన 23 మంది మెడికోలు..
Follow us on

Adilabad RIMS Medical students hospitalized: ఆదిలాబాద్‌లో 23 మంది రిమ్స్ వైద్య విద్యార్థులు అస్వస్థతతకు గురయ్యారు. ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా వారంతా అస్వస్థతతకు గురయ్యారని అధికారులు పేర్కొంటున్నారు. వసతి గృహంలోని మెడికోలంతా మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం కొంతమందికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. వారంతా వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే రెండు నెలల నుంచి మెస్‌ మూతబడి ఉందని విద్యార్థులు వెల్లడించారు. ఈ రోజే మెస్‌ను తెరిచారని.. మధ్యాహ్నం 30 మంది వరకు భోజనం చేసినట్లు విద్యార్థులు వెల్లడించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

సామాన్యుడిపై పెట్రోల్, డీజిల్ ధరల భారం పడదు.. ట్విట్టర్ వేదికగా వెల్లడించిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్