Telangana: నువ్వు లేక జీవితం లేదన్నాడు.. చివరికి ప్రియురాలి ఆత్మహత్యకు కారణమయ్యాడు..!

| Edited By: Balaraju Goud

May 30, 2024 | 8:51 AM

హైదరాబాద్ శివారులో దారుణం వెలుగు చూసింది. ప్రేమించిన వ్యక్తి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Telangana: నువ్వు లేక జీవితం లేదన్నాడు.. చివరికి ప్రియురాలి ఆత్మహత్యకు కారణమయ్యాడు..!
Love Fail
Follow us on

హైదరాబాద్ శివారులో దారుణం వెలుగు చూసింది. ప్రేమించిన వ్యక్తి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రేమించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చివరికి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు ఓ ప్రబుద్ధుడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోనీ న్యూ ఎల్ బీ నగర్‌లో నివాసముండే బాలబోయిన కుమార్ కుమార్తె అఖిల(22) ప్రైవేట్ జాబ్ చేస్తోంది. అయితే మే28వ తేదీ మంగళవారం రాత్రి అకస్మాత్తుగా ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అఖిలను పోరగంటి ప్రాంతానికి చెందిన అఖిల్ సాయి గౌడ్ ప్రేమ పేరుతో వెంటపడి వేధించాడు. తన ప్రేమలో ఒప్పుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో తప్పని పరిస్థితితో అఖిల అతని ప్రేమలో ఒప్పుకుంది.

ఇదే విషయాన్ని వారి కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. ఆ ఇష్టాన్ని కాదనలేక బంధువుల సమక్షంలో అందరు మాట్లాడడంతో కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా, ప్రేమను ఒప్పుకున్నప్పటి నుండి అఖిల్ సాయి గౌడ్ అఖిలను చాలా ఇబ్బందులకు గురి చేశాడు. రోడ్డుమీద అందరూ చూస్తుండగానే శారీరకంగా, మానసికంగా చిత్ర హింసలు పెట్టాడు. అంతే కాకుండా ఫోన్‌లో కూడా వేధించాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ విషయం స్థానికులకు, బంధువులకు తెలవడంతో అతగాడిని మందలించారు.

కొన్ని ఏళ్ళుగా సాగిన వీరి ప్రేమకు కాదని, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు అఖిల్ సాయి. దీంతో మానసికంగా కుంగిపోయిన అఖిల ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తండ్రి కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..