
చైనాలోని జెజియాంగ్ యూనివర్సిటీ నిపుణుల పరిశోధన ప్రకారం, సాధారణ ఆడియో ఫైల్స్ అంటే వీడియోలు, మ్యూజిక్, వాయిస్ నోట్స్లో మనుషులు గమనించలేని సూక్ష్మ మార్పులు చేస్తారు. ఈ సాంకేతికత సుమారు 79% నుంచి 96% విజయవంతమైన రేటుతో పనిచేస్తుందని తేలింది. ఈ దాడులు మైక్రోసాఫ్ట్, మిస్ట్రాల్ వంటి దిగ్గజ కంపెనీల ఏఐ సర్వీసులపై కూడా ప్రభావం చూపాయని నిపుణులు వెల్లడించారు. ఆడియో వేవ్ఫామ్స్లో ప్రతిధ్వని లాంటి మార్పులు చేయడం ద్వారా ఏఐకి దాచిన ఆదేశాలను అమలు చేసేలా సైబర్ నేరగాళ్లు ప్రోగ్రామ్ చేస్తున్నారు.
హిడెన్ ఆడియో దాడులు సాధారణ రక్షణ వ్యవస్థలను సులభంగా అధిగమిస్తాయి. దీనివల్ల జరిగే నష్టాలు ఊహించలేనంత తీవ్రంగా ఉంటాయి:
భవిష్యత్తులో ఈ తరహా సైబర్ దాడులు మరింత విస్తరించే అవకాశం ఉన్నందున, వినియోగదారులు అప్రమత్తంగా ఉండటం అత్యవసరం.
ఏఐ సిస్టమ్స్ను సురక్షితంగా వాడుకోవడం అనేది ప్రస్తుతం ప్రతి వినియోగదారుడి బాధ్యత. నమ్మకమైన యాప్లను మాత్రమే ఉపయోగించడం, పబ్లిక్ ప్లేస్లలో హెడ్ఫోన్స్ వాడటం వంటి చిన్న జాగ్రత్తలతో ఈ ముప్పు నుండి కొంతవరకు బయటపడవచ్చు. ఏఐ అభివృద్ధి చెందుతున్న కొద్దీ దానికి తగిన రక్షణ కవచాలను ఏర్పాటు చేసుకోవడం కంపెనీల బాధ్యత అయితే, జాగ్రత్తగా ఉండటం వినియోగదారుల ప్రాథమిక అవసరం.