భారతదేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగం రోజురోజుకీ పెరుగుతుంది. అమెరికా, చైనా తర్వాత భారత్లోనే స్మార్ట్ ఫోన్ వినియోగం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు తమ ఫోన్లను గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ చేసిన అనంతరం భారత్లో లాంచ్ చేస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఎంఐ ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ను లాంచ్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ రెడ్ మీ నోట్ 13 సిరీస్ జనవరిలో భారతదేశంలో ప్రారంభించింది. తాజాగా రెడ్ నోట్ 14 సిరీస్ను కూడా ఎంఐ భారత్లో లాంచ్ చేయనుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రెడ్ మీ నోట్ 14 సిరీస్ ఫొటోలు వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో రెడ్మీ నోట్ 14 సిరీస్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
రెడ్ మీ నోట్ 14 సిరీస్ ఫీచర్స్ ఇవేనంటూ కొన్ని టెక్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. రెడ్ మీ నోట్ 14 ఫోన్ 50 మెగాపిక్సెల్తో పెద్ద ప్రైమరీ సెన్సార్తో వస్తుంది. అయితే ఈ ఫోన్ వెనుకవైపు టెలిఫోటో కెమెరా లేదని చెబుతున్నారు. రెడ్ మీ నోట్ 13 ప్రో మాదిరిగానే ఫోన్ మధ్యలో హోల్ పంచ్ కటౌట్తో 1.5 కె రిజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే డ్యూయల్ మైక్రో-కర్వ్డ్ స్క్రీన్ అని అంచనా వేస్తున్నారు. రెడ్ మీ నోట్ 14 సిరీస్ ఫోన్ సెప్టెంబర్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్ ఆకట్టుకుంటుంది. అలాగే ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత.
ఈ ఏడాది జనవరిలో భారతదేశంలో రిలీజ్ చేసిన రెడ్ మీ నోట్ 13 ఫోన్ రూ. 25,999కు వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6.67 అంగుళాల 1.5కే ఎమోఎల్ఈడీ స్క్రీన్తో వస్తుంది. అలాగే 12 జీబీ ర్యామ్, స్నాప్ డ్రాగన్ 7 ఎస్ జెన్ 2 చిప్ ఆధారంగా పని చేస్తుంది. ఫోన్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,100 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..