
భారతదేశంలో పెరిగిన స్మార్ట్ ఫోన్ వినియోగం నేపథ్యంలో అన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోన్స్ను లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఏ ఫోన్ తీసుకున్నా వెనక వైపు కెమెరాలు ఒకే రకంగా ఉంటున్నాయి. ఫోన్ ధరకు అనుగుణంగా డ్యుయల్, ట్రిపుల్ కెమెరాల సెటప్తో వస్తున్నాయి. అయితే ఫ్రంట్ కెమెరా మాత్రం ధరను బట్టి ఒకే కెమెరాతో వస్తున్నాయి. అయితే తాజాగా ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ అయిన ఎంఐ డ్యుయల్ ఫ్రంట్ కెమెరా సెటప్తో కొత్త ఫోన్ను రిలీజ్ చేయబోతుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎంఐ సివీ పేరుతో రిలీజ్ చేస్తున్న ఈ ఫోన్ను కంపెనీ మే 25న లాంచ్ చేస్తుందని సమాచారం. అలాగే ఈ ఫోన్ కోనోమట్ గ్రే, మింట్ గ్రీన్, ఎడ్వంచర్ గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంటుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్లను టార్గెట్ చేస్తూ ఎంఐ కంపెనీ ఈ ఫోన్ రిలీజ్ చేస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ తాజా ఫోన్ గురించి కొన్ని లీక్స్ టెక్ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. కాబట్టి ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో? ఓ లుక్కేద్దాం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..