
2025 లో కీలక ప్రయోగాలు చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో) 2026లో భారీ ప్రయోగాలను లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఏడాది మొదట్లోనే తొలి ప్రయోగాన్ని చేపట్టేందుకు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు భారత రక్షణ వ్యవస్థకు మూడో నేత్రంలా పనిచేస్తున్న ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లను అనేకం అంతరిక్షంలో ఇస్రో ప్రవేశపెట్టింది. తాజాగా జరుగుతున్న పీఎస్ఎల్వి సి.62 ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపనున్న ఎర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్ సిరీస్లో తొలిసారిగా ప్రత్యేక నామకరణం చేసింది ఇస్రో. శత్రుదేశాల కదలికలను గుర్తించేందుకు ఇస్రో చేపడుతున్న ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ల పరంపరలో ఈ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు అన్వేష అనే నామకరణం చేశారు. ఇకనుంచి భూ పరిశీలన అలాగే సరిహద్దులో దేశ భద్రత కోసం రక్షణ కవచనంలో పనిచేసే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లను అన్వేష సీరిస్ లో ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించింది.
సాటిలైట్ అన్వేష ప్రత్యేకలేమిటి?
వాతావరణంలో మార్పులు, విపత్తులు సంభవించే సమయంలో ముందస్తు సమాచారం కూడా ఈ ఉపగ్రహం సూచిస్తుంది. ఈనెల 12 న షార్ నుండి pslv..c62 రాకెట్ ప్రయోగం జరగనుంది.. ఇందుకోసం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. షార్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి pslv.. c62 ద్వారా నింగిలోకి పంపనున్న Eos N1 .( అన్వేష) శాటిలైట్ బరువు 1485 కేజీలు .600 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింక్రనైజ్ ఆర్బిట్ లోకి ఈ శాటిలైట్ ను ప్రవేశపెట్ట నున్నారు.
దీనితో పాటు 200 కేజీలు బరువు తో కూడిన మరో 17 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్న శాస్త్రవేత్తలు . సింగపూర్. లక్సెంబర్గ్, యూరప్, యునైటెడ్ స్టేట్స్, uae దేశాలు కు చెందిన మరో 17 చిన్న ఉపగ్రహాలను ఇస్రో ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది. స్వదేశీ అవసరం కోసం మన దేశానికి చెందిన ఉపగ్రహాన్ని పక్షులకు పంపడంతో పాటు కమర్షియల్ గా కూడా ఇతర దేశాలకు చెందిన 17 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపి ఆదాయం మార్గంగా కూడా ఈ ప్రయోగం ఇస్రోకి దోహదపడుతోంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.