
ఈ రోజుల్లో ల్యాప్టాప్లు కేవలం ఆఫీస్ పనికే పరిమితం కాలేదు. ఆన్లైన్ క్లాసులు, మీటింగ్లు, సినిమాలు చూడటం నుండి అనేక పనులకు ఎంతో మంది వీటిని ఉపయోగిస్తున్నారు. అయి, కొన్నిసార్లు చేతిలో ఫోన్ ఛార్జర్ లేనప్పుడు లేదా పవర్ బ్యాంక్ అందుబాటులో లేనప్పుడు.. చాలామంది ఫోన్ను ల్యాప్టాప్ యూఎస్బీ పోర్ట్కు కనెక్ట్ చేసి ఛార్జ్ చేస్తుంటారు. ఇలా చేయడం మంచిదేనా..? దీనివల్ల ఫోన్ బ్యాటరీ పాడవుతుందా? అనే డౌట్లు చాలా మందికి ఉంటాయి. అయితే మీ ల్యాప్టాప్ సరిగ్గా పనిచేస్తూ, మీరు ఉపయోగిస్తున్న కేబుల్ మంచి క్వాలిటీతో ఉంటే.. ల్యాప్టాప్ నుండి ఫోన్ను ఛార్జ్ చేయడం సాధారణంగా సురక్షితమే. అయితే వాల్ ఛార్జర్తో పోలిస్తే ల్యాప్టాప్ నుండి ఛార్జింగ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే ల్యాప్టాప్ యూఎస్బీ పోర్ట్లు సాధారణ ఛార్జర్ల కంటే చాలా తక్కువ పవర్ని అందిస్తాయి.
ఈ రోజుల్లో వస్తున్న దాదాపు అన్ని స్మార్ట్ఫోన్లలో ఓవర్ ఛార్జింగ్, ఓవర్ కరెంట్ నుండి రక్షణ కల్పించే అధునాతన సేఫ్టీ టెక్నాలజీ ఉంటుంది. కాబట్టి సాధారణ పరిస్థితుల్లో లాప్టాప్ ద్వారా ఫోన్ ఛార్జ్ చేయడం వల్ల ఫోన్ బ్యాటరీకి ఎలాంటి పెద్ద ప్రమాదం జరగదు.
ల్యాప్టాప్తో ఛార్జ్ చేసేటప్పుడు అసలైన ప్రమాదం బ్యాటరీతో కాదు.. మీ డేటాతో.. అవును.. పరిచయం లేని వ్యక్తుల కంప్యూటర్లు లేదా పబ్లిక్ కంప్యూటర్ల నుండి ఫోన్ను ఛార్జ్ చేయడం చాలా ప్రమాదకరం. యూఎస్బీ కేబుల్ ద్వారా కేవలం విద్యుత్ మాత్రమే కాకుండా డేటా ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది. ఒకవేళ మీ ఫోన్లో File Transfer మోడ్ ఆన్లో ఉంటే, మీ పర్సనల్ ఫోటోలు, ఫైళ్లు ఇతరుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అందుకే ఎల్లప్పుడూ మీకు నమ్మకమైన ల్యాప్టాప్లను మాత్రమే ఛార్జింగ్ కోసం ఉపయోగించండి. ఫోన్ కనెక్ట్ చేసినప్పుడు Charge Only మోడ్ను మాత్రమే ఎంచుకోండి.
మీ ఫోన్ ల్యాప్టాప్నుండి చాలా నెమ్మదిగా ఛార్జ్ అవుతుంటే దానికి ప్రధాన కారణాలు ఇవే..