
టెక్ ప్రపంచంలో చాట్ జీపీటీ ఓ సంచలనం అని చెప్పాలి. ప్రపంచ దిగ్గజ సంస్థలకు చెమటలు పట్టిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారంగా పనిచేసే సెర్చ్ ఇంజిన్ రూపొందించి అందరి మన్ననలు అందుకుంటోంది. దీనికి పోటీ ఇచ్చేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని టెక్ కంపెనీలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. అన్ని టెక్ దిగ్గజాల మధ్య ఈ ‘కృత్రిమ’ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇదే క్రమంలో చైనాకు చెందిన బైడు సంస్థ ఎర్నీ(ERNIE ) అనే కొత్త చాట్ బాట్ ను లాంచ్ చేసింది. దీని ఫీచర్లు ఏంటి? ఎలా పనిచేస్తుంది? చాట్ జీపీటీకి పోటీ ఇవ్వగలుగుతుందా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
చైనీస్ ప్రభుత్వం ఏఐ డెవలపర్ల కోసం ఈ నెలలో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఆన్లైన్లో సమాచారాన్ని కఠినంగా నియంత్రిస్తూనే, చాట్ జీపీటీ తయారీదారు ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ వంటి వాటితో రేసులో ఉండేందుకు వారిని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ఈ ఎర్నీ బాట్(ERNIE Bot)ను బైడు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది చైనాలోనే అందుబాటులో ఉంది. మిగిలిన ప్రపంచానికి ఇంకా అందుబాటులోకి రాలేదు.
ఎర్నీ బాట్(ERNIE Bot) ఆగస్టు 31 నుంచి అందరి ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి వస్తున్నట్లు బైడు ప్రకటించింది. ఇది నాలుగు పనులకు ప్రజలకు అందించడమే లక్ష్యంగా దీనిని తీసుకొచ్చినట్లు పేర్కొంది. అర్థం చేసుకోవడం, ఉత్పాదకత, రీజనింగ్, జ్ఞాపకం ఉంచుకోవడం. వీటి ద్వారా ప్రజలకు ఇది సేవలందిస్తుందని బైడు వివరించింది. వాస్తవానికి ఈ చాట్ బాట్ గత మార్చిలోనే మార్కెట్లోకి వచ్చినా.. కొంత మందికి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. దీన్ని విస్తృతంగా అందుబాటులో ఉంచడం ద్వారా, యాప్ను త్వరితగతిన మెరుగుపరచడానికి ఫీడ్ కోరుతున్నట్లు బైడు సీఈఓ రాబిన్ లి ప్రకటనలో పేర్కొన్నారు.
ఎర్నీ బాట్(ERNIE Bot)ను పరీక్షించేందుకు పలువురు కొన్ని ప్రశ్నలు అడగ్గా దాని విస్తారమైన డేటా నుంచి అది సమాధానాలు ఇచ్చింది. అవి కూడా సోషలిజం ప్రధాన విలువలకు కట్టుబడి ఉండేలా చాట్ బాట్ కి కఠిన శిక్షణ ఇచ్చారు. ఎందుకంటే చైనాలో ప్రభుత్వ మార్గదర్శకాలు అలా ఉన్నాయి. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లకుండా చైనా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో పలువురు అడిగిన ప్రశ్నలకు ఎర్నీ బాట్ ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు చూద్దాం
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..