ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ఇప్పుడు ట్రెండింగ్గా మారాయి. వీటి పట్ల యువత.. ఇప్పుడు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే వీటి ద్వారా అనేక మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆన్లైన్ డేటింగ్ యాప్స్లో పడి యువత తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారని పోలీసులు అంటున్నారు.
యువత తమ వివరాలు, ఫొటోలు అప్లోడ్ చేయడం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయని అన్నారు పోలీసులు. డేటింగ్ యాప్స్లో వ్యక్తిగత సమాచారం పెట్టడంతో పాటు.. గుర్తుతెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి వాటికి వీలైనంతవరకూ దూరంగా ఉండాలని సూచించారు. కాగా.. కొంతమంది అబ్బాయిలు కూడా అమ్మాయిల ఫొటోలు పెట్టి మోసాలకు పాల్పడుతున్నారని.. ఇలాంటి యాప్స్ వల్ల కొంతమంది వాళ్ల జీవితాలనే కోల్పోతున్నారని వీటికి దూరంగా ఉండాలని చెప్పారు పోలీసులు.