భారత ఫుట్బాల్ టీమ్ సారథిపై నెటిజన్ జాతి వివక్ష వ్యాఖ్యలు..
భారత ఫుట్బాల్ టీమ్ సారథి సునీల్ ఛెత్రి సోషల్ మీడియాలో జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నాడు. ఇండియా క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లితో ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్ సందర్భంగా ఓ నెటిజన్ అతణ్ని ఉద్దేశించి.. “ఎవరీ నేపాలీ అంటూ ఓవరాక్షన్ చేశాడు. దీనిపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే జరిగింది. 13 ఏళ్లుగా ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టీమ్ లో అద్భుతంగా సత్తా చాటుతూ.. ఎనిమిదేళ్లుగా జట్టుకు సారథిగా వ్యవహరిస్తోన్న గొప్ప ఆటగాడిని ఉద్దేశించి ఇలా […]
భారత ఫుట్బాల్ టీమ్ సారథి సునీల్ ఛెత్రి సోషల్ మీడియాలో జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నాడు. ఇండియా క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లితో ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్ సందర్భంగా ఓ నెటిజన్ అతణ్ని ఉద్దేశించి.. “ఎవరీ నేపాలీ అంటూ ఓవరాక్షన్ చేశాడు. దీనిపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే జరిగింది. 13 ఏళ్లుగా ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టీమ్ లో అద్భుతంగా సత్తా చాటుతూ.. ఎనిమిదేళ్లుగా జట్టుకు సారథిగా వ్యవహరిస్తోన్న గొప్ప ఆటగాడిని ఉద్దేశించి ఇలా మాట్లాడడమేంటంటూ నెటిజన్లు ఫైరయ్యారు. దీంతో ఆ వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ క్లోజ్ చేసి వెళ్లిపోయాడు.
ఇక ఈ చాట్ కార్యక్రమంలో ఛెత్రి అడిగిన చాలా ప్రశ్నలకు విరాట్ ఆన్సర్స్ ఇచ్చాడు. జూనియర్ లెవల్ లో ఆడుతున్నప్పుడు తన తండ్రి లంచం ఇవ్వనందుకు ఓసారి తనకు టీమ్ లో చోటివ్వలేదని కోహ్లి వెల్లడించాడు. సచిన్ ఇన్నింగ్స్ల్లో షార్జా సెంచరీ (144) తనకు చాలా ఇష్టమన్న విరాట్.. అలాంటి ఇన్నింగ్స్ తానూ ఆడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను అభిమానించడానికి అతడి దూకుడే రీజన్ అని కోహ్లి తెలిపాడు.