Vinesh Phogat: పారిస్‌ ఒలంపిక్స్‌లో రాజకీయం చేశారు.. పీటీ ఉషపై వినేశ్ సంచలన వ్యాఖ్యలు

|

Sep 11, 2024 | 12:44 PM

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వినోశ్ ఫొగాట్.. ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ (IOA), దాని అధ్యక్షురాలు పీటీ ఉషపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. పారిస్‌లో వారి నుంచి తనకు ఏమి మద్దతు లభించిందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తనకు మద్దతు తెలిపే విషయంలో ఐవోఏ తీవ్ర జాప్యం కారణం చేసినందునే కాస్‌లో తీర్పు తనకు అనుకూలంగా రాలేదన్నారు.

Vinesh Phogat: పారిస్‌ ఒలంపిక్స్‌లో రాజకీయం చేశారు.. పీటీ ఉషపై వినేశ్ సంచలన వ్యాఖ్యలు
Vinesh Phogat with PT Usha (File Photo)
Follow us on

పారిస్ ఒలంపిక్స్‌లో తృటిలో పతకం చేజారిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్.. నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నందున.. ఫైనల్‌‌లో ఆడేందుకు అర్హత కోల్పోయిన వినేశ్‌ పతకాన్ని చేజారడం తెలిసిందే. ఫైనల్‌కు ముందు రోజు రాత్రికి రాత్రి బరువు తగ్గే ప్రయత్నంలో ఆమె డీహైడ్రేషన్‌కు గురై ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫైనల్‌కు చేరినందున తనకు పతకం రజత పతకం ఇవ్వాలంటూ ఆమె కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS)లో అప్పీల్ చేసుకున్నా ఊరట దక్కలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన వినేశ్.. రెజ్లింగ్ కెరీర్‌కు వీడ్కోలు పలికి.. వెంటనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆమె చుట్టూనే హర్యానా రాజకీయాలు నడుస్తున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వినోశ్ ఫొగాట్.. ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ (IOA), దాని అధ్యక్షురాలు పీటీ ఉషపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. పారిస్‌లో వారి నుంచి తనకు ఏమి మద్దతు లభించిందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తనకు మద్దతు తెలిపే విషయంలో ఐవోఏ తీవ్ర జాప్యం కారణం చేసినందునే కాస్‌లో తీర్పు తనకు అనుకూలంగా రాలేదన్నారు. పీటీ ఉష ఫొటోల కోసమే తనను పరామర్శించేందుకు వచ్చారని ఆరోపించారు. తన ఆరోగ్యం గురించి ఆమె ఏమీ ఆడగలేదని ఆరోపించారు. రాజకీయాల్లో తెరవెనుక చాలా జరిగినట్లే.. పారిస్‌లో కూడా పెద్ద రాజకీయం చేశారంటూ ఆమె అసహనం వ్యక్తంచేశారు. అందుకే తన గుండె బద్దలయ్యిందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. చాలా మంది రెజ్లింగ్‌కు వీడ్కోలు చెప్పొద్దని సలహా ఇచ్చారని.. అయితే అన్ని చోట్లా రాజకీయం ఉందని, తాను ఎందుకు రెజ్లింగ్ కొనసాగించాలని ప్రశ్నించారు.

వినేశ్ ఫొగాట్ ఇంటర్వ్యూ వీడియో..

తనను ఆస్పత్రిలో కలిసిన తర్వాత ఫొటోను పీటీ ఉషా సోషల్ మీడియాలో షేర్ చేయడంపై కూడా వినేశ్ ఫొగాడ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. పీటీ ఉష మేడమ్ తన వద్దకు వచ్చి తనకు చెప్పకుండానే ఫొటోలు దిగారని.. తర్వాత వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తెలిపారు.