భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ఫెడ్ కప్ హార్ట్ అవార్డును భారత ఏస్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కైవసం చేసుకుంది. ఆసియా/ఓషియానియా జోన్ నుంచి సానియా ఈ అవార్డుకు ఎంపికైంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్గా రికార్డులకెక్కింది. ఈ నెల 1 నుంచి వారం రోజుల పాటు జరిగిన ఆన్లైన్ ఓటింగ్లో 16985 మంది పాల్గొనగా 10 వేల పైచిలుకు ఓట్లతో ఆసియా పసిఫిక్ జోన్లో ఉన్న సానియా విజేతగా నిలిచింది. విజేతకు ఇచ్చే రూ. 1.5 లక్షలను ఆమె తెలంగాణ సీఎం సహాయ నిధికి పంపించింది.