ఓ వైపు భారత్ – పాకిస్తన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంటే, మరోవైపు పాక్ క్రికెటర్ భారతీయ యువతిని వివాహం చేసుకోవడం హాట్ టాపిక్ అయిపోయింది.. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ భారతీయ యువతి షామియా అర్జూను పెళ్లాడాడు. దుబాయ్లో ఆగస్టు 20న వీరి వివాహం జరిగింది. తమ వివాహం గురించి హసన్ అలీ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తన బ్యాచిలర్ జీవితానికి ఇదే చివరి రాత్రి అని ట్వీట్ చేశాడు. ఎడారి మధ్యలో నిర్వహించిన మోహిందీ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కూడా అప్లోడ్ చేశాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు వీరిద్దరి పెళ్లి ఫోటోలు, వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీరి వివాహనికి ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అయితే, తన పెళ్లికి రావాలంటూ.. ఇండియన్ క్రికెటర్లను కూడా హసన్ అలీ ఆహ్వానించినట్లుగా చెప్పాడు.. హసన్ అలీ భార్య షామియా హర్యానాకు చెందిన యువతి ఎమిరేట్స్ ఎయిర్లైన్స్లో ఆమె ప్లెట్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. ఆమె కుటుంబం ఢిల్లీలో స్థిరపడింది. వీరిద్దరూ దుబాయ్లో ఉండగానే ప్రేమలో పడినట్లుగా హసన్ తెలిపాడు. ఇదిలా ఉంటేఉంది