Nethra Kumanan: సెయిలర్ నేత్ర సరికొత్త ఘనత..తొలి మహిళ క్రీడాకారిణిగా రికార్డ్..

సెయిలర్ నేత్ర సరికొత్త ఘనత సాధించింది. ఒలింపిక్స్​లో సెయిలింగ్​లో పోటీపడనున్న తొలి మహిళ క్రీడాకారిణిగా నిలిచింది. ఒలింపిక్స్ అర్హత సాధించిన తొలి మహిళ సెయిలర్​గా నేత్రా కుమనన్‌ చరిత్ర సృష్టించింది. ఒమన్​లో జరుగుతున్న..

Nethra Kumanan: సెయిలర్ నేత్ర సరికొత్త ఘనత..తొలి మహిళ క్రీడాకారిణిగా రికార్డ్..
Nethra Kumanan Is The 10th

Updated on: Apr 09, 2021 | 2:13 AM

Indian sailor: సెయిలర్ నేత్ర సరికొత్త ఘనత సాధించింది. ఒలింపిక్స్​లో సెయిలింగ్​లో పోటీపడనున్న తొలి మహిళ క్రీడాకారిణిగా నిలిచింది. ఒలింపిక్స్ అర్హత సాధించిన తొలి మహిళ సెయిలర్​గా నేత్రా కుమనన్‌ చరిత్ర సృష్టించింది. ఒమన్​లో జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్​లోని లేజర్ రేడియల్ క్లాస్​ ఈవెంట్​లో పోటీ పడిన నేత్ర.. బుధవారం పోటీల్లో 21 పాయింట్లతో టాప్​లో నిలిచింది.

దీంతో తుది ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ఒలింపిక్స్​కు అర్హత సాధించింది. నేత్రాతో పాటు మన దేశం నుంచి మరో ముగ్గురు, సెయిలింగ్​ పోటీల కోసం ఒలింపిక్స్​కు వెళ్లనున్నారు. వీరిలో విష్ణు శరవణన్, గణపతి చెంగప్ప-వరుణ్ తక్కర్ జోడీ ఉన్నారు. ఇప్పటివరకు సెయిలింగ్​లో ఒలింపిక్స్​కు ప్రాతినిధ్యం వహించిన వారిలో తొమ్మిది మంది పురుషులు కాగా… మెగా క్రీడల్లో పాల్గొనున్న తొలి మహిళ సెయిలర్​గా నేత్ర సరికొత్త రికార్డులను సృష్టించారు. కరోనా ప్రభావంతో గతేడాది జరగాల్సిన ఒలింపిక్స్​ను.. సంవత్సరం వాయిదా వేసింది. దీంతో ఈ ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యోలో పోటీలు జరగనున్నాయి.

ఆగష్టు 21, 1997 న జన్మించిన నేత్రా 2011 లో తమిళనాడు సెయిలింగ్ అసోసియేషన్ నిర్వహించిన వేసవి శిబిరంలో తొలి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నేత్ర క్రీడా ప్రయాణం కొనసాగుతోంది. ఇది త్వరలోనే ఆమె జీవితంలో ఒక భాగంగా మారిపోయింది.

చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉన్న నేత్రా రెండుసార్లు జాతీయ ఛాంపియన్‌షిప్‌లు గెలుచుకుంది. మరో రెండు సందర్భాలలో రన్నరప్‌గా నిలిచింది.  

ఇవి కూడా చదవండి: Alert Wi-Fi: పబ్లిక్ Wi-Fi వాడుతున్నారా..? వాడుకుని బ్యాకింగ్ ట్రాన్సక్షన్స్ చేస్తున్నారా? అయితే బీ అలర్ట్..!

COVID-19 Confirmed: ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్.. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నానంటూ ట్వీట్..