ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్ల హవా.. కోహ్లీ ఫస్ట్.. రోహిత్ సెకండ్..

|

Dec 10, 2020 | 7:57 PM

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్ల హవా కొనసాగుతోంది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుల చేసిన వన్డే ర్యాంకింగ్‌ బ్యాటింగ్ విభాగంలో ఎప్పటిలాగే టీమిండియా సారధి విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్ల హవా.. కోహ్లీ ఫస్ట్.. రోహిత్ సెకండ్..
Follow us on

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్ల హవా కొనసాగుతోంది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుల చేసిన వన్డే ర్యాంకింగ్‌ బ్యాటింగ్ విభాగంలో ఎప్పటిలాగే టీమిండియా సారధి విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు. ఇక రెండో స్థానంలో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. 870 పాయింట్లతో టాప్‌-10 లిస్ట్‌లో విరాట్ అగ్రభాగాన ఉండగా, 842 పాయింట్లతో రోహిత్ 2వ స్థానంలో నిలిచాడు. గాయాల బెడదతో ఆసిస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు రోహిత్ దూరమైనా తన స్థానాన్ని మాత్రం పదిలపర్చుకోవడం విశేషం. కాగా, రోహిత్‌కు చేరువగా కేవలం 5 పాయింట్ల తేడాతో మూడో స్థానంలో పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ ఆజామ్(837) నిలిచాడు. ఇదిలాఉండగా టాప్‌ 50లో తొలిసారి హార్ధిక్ పాండ్యా చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగిన టీ20, వన్డే సిరీసుల్లో అద్భుత ఆటతీరు కనబరిచిన పాండ్యా 553 పాయింట్లతో 49వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలింగ్‌లో టాప్ 10 విషయానికి వస్తే.. టీమిండియా నుండి ఒక్కరికి మాత్రమే చోటు దక్కింది. పేసర్ బుమ్రా టాప్10 జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.