IND vs PAK: దుబాయ్ స్టేడియంలో ఊర్వశి రౌతేలా.. వీడియో షేర్ చేసిన బాలీవుడ్ బ్యూటీ

|

Oct 25, 2021 | 10:55 AM

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ - పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఊర్వశి రౌతేలా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. దాయాది దేశాలు రెండేళ్ల తర్వాత తొలిసారిగా తలపడుతుండటంలో అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

IND vs PAK: దుబాయ్ స్టేడియంలో ఊర్వశి రౌతేలా.. వీడియో షేర్ చేసిన బాలీవుడ్ బ్యూటీ
Urvashi Rautela
Follow us on

Urvashi Rautela: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ – పాక్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. దాయాది దేశాలు రెండేళ్ల తర్వాత తొలిసారిగా తలపడుతుండటంలో ఈ టీ20 మ్యాచ్‌పై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. మ్యాచ్‌ను నేరుగా వీక్షించిన ఊర్వశి రౌతేలా.. రిషభ్ పంత్ ఆడుతున్నప్పుడు ఉత్సాహంగా కనిపించారు. రిషభ్ పంత్ సిక్సర్లు, బౌండరీలను ఎంజాయ్ చేశారు. జాతీయ జెండాను ఊపుతూ పంత్‌ను ఎంకరేజ్ చేశారు. గతంలో(2018లో) వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరగడం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఊర్వశి రౌతేలాను వాట్సప్‌లో రిషభ్ పంత్ బ్లాక్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఆటపై ఫోకస్ పెట్టేందుకే రౌతేలా నుంచి పంత్ దూరం జరిగినట్లు ప్రచారం జరిగింది. అక్టోబర్ 4న పంత్ జన్మదినాన్ని జరుపుకోగా.. రౌతేలా బర్త్ డే విషెస్ తెలిపింది. దీంతో ఇద్దరి మధ్య ఇంకా ఏదో నడుస్తున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి.

ఇప్పుడు మరోసారి ఆమె దుబాయ్ స్టేడియంలో నేరుగా మ్యాచ్‌ను వీక్షించడం, పంత్‌ ఆటను ఎంజాయ్ చేయడం మీడియాను ఆకట్టుకుంది. అటు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా స్టేడియంలో కనిపించారు.

ఊర్వశి రౌతేలా ఇన్‌స్టా పోస్ట్..

ఊర్వశి రౌతేలా దుబాయ్ స్టేడియంలో కనిపించడంపై సోషల్ మీడియా వేదికగానే ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఊర్వశి రౌతేలా స్టేడియంలో ఉన్నారు.. పంత్ పాకిస్థాన్‌పై రెచ్చిపోవడం ఖాయమంటూ కొందరు కామెంట్స్ చేశారు. పంత్ సెంచరీ చేయడం ఖాయమంటూ మరికొందరు కామెంట్స్ చేశారు.


ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్ 39 పరుగులు(30 బంతులు)తో రాణించాడు. రెండు బౌండరీలు, రెండు సిక్సర్లు బాదాడు. జట్టులో విరాట్ కోహ్లీ(57) తర్వాత రెండో టాప్ స్కోరర్‌గా పంత్ నిలిచాడు.

Also Read..

Rakul Preet Singh: మల్లెతీగ లాంటి ఫిజిక్ తో అందాలు వలకపోస్తున్న రకుల్ ప్రీత్

Health Tips: కోడి గుడ్లతో మరో లాభం కూడా..! నమ్మరేమో..మరీ