IND VS AUS Test Match : రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. క్రీజ్‌లో పుజారా, రహానే

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమిండియా  రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ , శుభ్‌మన్‌గిల్ అవుట్ అయ్యారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులు చేసింది.

IND VS AUS Test Match : రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. క్రీజ్‌లో పుజారా, రహానే
Follow us

|

Updated on: Jan 08, 2021 | 2:10 PM

IND VS AUS Test Match : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమిండియా  రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ , శుభ్‌మన్‌గిల్ అవుట్ అయ్యారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులు చేసింది. ఈ లక్ష్య ఛేదనలో నిలకడగా ఆడుతున్న తరుణంలో వెంటవెంటనే రెండు వికెట్లను కోల్పోయింది భారత్ . 70 పరుగుల వద్ద రోహిత్ శర్మ (26) పరుగులకు వెనుదిరిగాడు. 85 పరుగుల దగ్గర శుభ్‌మన్‌గిల్  50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో పుజారా (3), రహానే (1) ఉన్నారు.  34 ఓవర్లకు టీమిండియా 86 పరుగులు చేసింది. అంతకుముందు స్టీవ్‌స్మిత్‌(131) శతకంతో చెలరేగడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులు చేసింది. జడేజా 4, బుమ్రా, సైని 2, సిరాజ్ 1 వికెట్‌ తీశారు.