భళా కెప్టెన్! ప్రతిష్ఠాత్మక కోట్లా స్టేడియంలో కోహ్లీ స్టాండ్​

| Edited By: Pardhasaradhi Peri

Aug 19, 2019 | 10:04 AM

భారత సారధి, రన్ మెషీన్ విరాట కోహ్లి అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.  ప్రపంచ క్రికెట్​లో ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో టాప్ లిస్ట్‌లో కోహ్లికి… సత్కారం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ఢిల్లీ జిల్లా​ క్రికెట్​ అసోసియేషన్​(డీడీసీఏ). కోట్లా మైదానంలోని ఓ స్టాండ్​కు విరాట్​ పేరు పెట్టనుంది. సెప్టెంబర్​ 12న జవహర్​లాల్​ నెహ్రూ స్టేడియం వేదికగా.. భారత జట్టును సత్కరించనుంది ఢిల్లీ క్రికెట్​ అసోసియేషన్​. గతంలో భారత మాజీ క్రికెటర్లు, ఢిల్లీ క్రీడాకారులైన బిషన్​ సింగ్​, మొహిందర్​ […]

భళా కెప్టెన్! ప్రతిష్ఠాత్మక కోట్లా స్టేడియంలో కోహ్లీ స్టాండ్​
Follow us on

భారత సారధి, రన్ మెషీన్ విరాట కోహ్లి అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.  ప్రపంచ క్రికెట్​లో ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో టాప్ లిస్ట్‌లో కోహ్లికి… సత్కారం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ఢిల్లీ జిల్లా​ క్రికెట్​ అసోసియేషన్​(డీడీసీఏ). కోట్లా మైదానంలోని ఓ స్టాండ్​కు విరాట్​ పేరు పెట్టనుంది. సెప్టెంబర్​ 12న జవహర్​లాల్​ నెహ్రూ స్టేడియం వేదికగా.. భారత జట్టును సత్కరించనుంది ఢిల్లీ క్రికెట్​ అసోసియేషన్​. గతంలో భారత మాజీ క్రికెటర్లు, ఢిల్లీ క్రీడాకారులైన బిషన్​ సింగ్​, మొహిందర్​ అమర్​నాథ్​కు​ ఇదే విధంగా గౌరవం దక్కింది. గతంలో వీరేందర్​ సెహ్వాగ్​, అంజుమ్​ చోప్రాల పేర్లను మైదానంలోని స్వాగత ద్వారాలకు పెట్టింది ఢిల్లీ క్రికెట్​ అసోసియేషన్​.