చీఫ్ సెలెక్టర్ వివరణపై అజ్జూ ఫైర్!

అంబటి రాయుడుకి ప్రపంచ కప్ జట్టులో స్థానం కల్పించకపోవడం పట్ల మాజీ కెప్టెన్ అజారుద్దీన్ స్పందించారు. వరల్డ్ కప్ టోర్నీలో నాలుగో స్థానానికి రాయుడిని ఎంపిక చేస్తారని భావించారు. కానీ సెలెక్టర్లు త్రీడీ ఆటగాడనే కారణంతో విజయ్ శంకర్‌కు అవకాశం ఇచ్చి రాయుణ్ని పక్కనబెట్టారు. తర్వాత స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. శిఖర్ ధావన్, మురళీ విజయ్ గాయపడిన తర్వాత రాయుడిని కాదని మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేయడం పట్ల అజారుద్దీన్ స్పందించారు. స్టాండ్ బైగా ఉన్న రాయుణ్నే […]

చీఫ్ సెలెక్టర్ వివరణపై అజ్జూ ఫైర్!

Edited By:

Updated on: Jul 24, 2019 | 6:33 AM

అంబటి రాయుడుకి ప్రపంచ కప్ జట్టులో స్థానం కల్పించకపోవడం పట్ల మాజీ కెప్టెన్ అజారుద్దీన్ స్పందించారు. వరల్డ్ కప్ టోర్నీలో నాలుగో స్థానానికి రాయుడిని ఎంపిక చేస్తారని భావించారు. కానీ సెలెక్టర్లు త్రీడీ ఆటగాడనే కారణంతో విజయ్ శంకర్‌కు అవకాశం ఇచ్చి రాయుణ్ని పక్కనబెట్టారు. తర్వాత స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. శిఖర్ ధావన్, మురళీ విజయ్ గాయపడిన తర్వాత రాయుడిని కాదని మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేయడం పట్ల అజారుద్దీన్ స్పందించారు.

స్టాండ్ బైగా ఉన్న రాయుణ్నే తప్పకుండా ఎంపిక చేయాల్సిందని అజ్జూ అభిప్రాయపడ్డారు. ఎవరైనా ఆటగాణ్ని రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించాల్సిన అవసరం తలెత్తినప్పుడు.. సెలెక్టర్లు కెప్టెన్, కోచ్ ఇష్టపూర్వకంగా కాకుండా.. లేదు మేం కచ్చితంగా ఈ ఆటగాడినే పంపుతామని ఎమ్మెస్కే ప్రసాద్‌ను ఉద్దేశించి అజారుద్దీన్ కామెంట్ చేశారు. కెప్టెన్, కోచ్ ఇష్టం మేరకే మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేశామని ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చిన తరుణంలో అజ్జూ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us