Team India: అతను 8వ వింత.. అలాంటోడు దొరకడం చాలా అరుదు: విరాట్ కోహ్లీ భావోద్వేగ ప్రసంగం

Team India Victory Parade: గురువారం సాయంత్రం ముంబైలో టీమిండియాకు ఘనస్వాగతం లభించింది. అక్కడి నుంచి బస్‌ ఎక్కి మెరైన్‌డ్రైవ్‌కు చేరుకోగా, ప్రపంచ విజేతగా నిలిచిన భారత జట్టుకు స్వాగతం పలికేందుకు అప్పటికే వేలాది మంది జనం తరలివచ్చారు. నారిమన్ పాయింట్ నుంచి, భారత ఆటగాళ్లందరూ ఓపెన్ బస్సులో ఎక్కి విజయోత్సవ పరేడ్‌ను ప్రారంభించారు.

Team India: అతను 8వ వింత.. అలాంటోడు దొరకడం చాలా అరుదు: విరాట్ కోహ్లీ భావోద్వేగ ప్రసంగం
Virat Kohli Rohit Sharma

Updated on: Jul 05, 2024 | 7:20 AM

Team India Victory Parade: గురువారం సాయంత్రం ముంబైలో టీమిండియాకు ఘనస్వాగతం లభించింది. అక్కడి నుంచి బస్‌ ఎక్కి మెరైన్‌డ్రైవ్‌కు చేరుకోగా, ప్రపంచ విజేతగా నిలిచిన భారత జట్టుకు స్వాగతం పలికేందుకు అప్పటికే వేలాది మంది జనం తరలివచ్చారు. నారిమన్ పాయింట్ నుంచి, భారత ఆటగాళ్లందరూ ఓపెన్ బస్సులో ఎక్కి విజయోత్సవ పరేడ్‌ను ప్రారంభించారు. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కూడా అభిమానుల శుభాకాంక్షలు స్వీకరించారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి టీమిండియా చారిత్రాత్మక విజయానికి జస్ప్రీత్ బుమ్రాకు ఎంతో క్రెడిట్ ఇచ్చాడు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీ చిరస్మరణీయమని రోహిత్ శర్మ అభివర్ణించారు. బీసీసీఐ చైర్మన్ రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా రూ.125 కోట్ల చెక్కును టీమ్ ఇండియాకు అందజేయడంతో ఈ మొత్తం కార్యక్రమం ముగిసింది.

ఎవరు ఏం మాట్లాడరంటే?

రోహిత్ శర్మ- ఈ ట్రోఫీ మన కోసం కాదు దేశప్రజలందరికీ. ఉదయం పీఎం మోడీని కలవడం చాలా గౌరవంగా భావించాను. క్రీడల పట్ల ఆయనకు ఎంతో అవగాహన ఉంది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ భారీ షాట్ ఆడగానే.. గాలి బలంగా వీయడంతో సిక్సర్ అవుతుందని అనుకున్నా.. అదంతా విధి రాసి ఉంది. చివర్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ అద్భుతంగా ఉంది. ఈ టీం మొత్తానికి నేను గర్వపడుతున్నాను.

విరాట్ కోహ్లీ- రోహిత్ శర్మ, నేను చాలా కాలంగా ఈ ఫీట్ సాధించాలని ప్రయత్నిస్తున్నాం. ప్రపంచకప్ గెలవాలన్నదే మా కల. మేం గత 15 సంవత్సరాలుగా కలిసి ఆడుతున్నాం, రోహిత్ ఇంత ఉద్వేగానికి లోనవడం బహుశా ఇదే మొదటిసారి. రోహిత్ ఏడుస్తున్నాడు, నేను ఏడ్చేశా, మేమిద్దరం ఒకరినొకరు కౌగిలించుకున్నాం. ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేం. జస్ప్రీత్ బుమ్రా వంటి బౌలర్లు మనకు దొరకరు. అతను ప్రపంచంలోని ఎనిమిదో అద్భుతం అంటూ చెప్పుకొచ్చాడు.

రాహుల్ ద్రవిడ్- ప్రజల ఈ ప్రేమను నేను చాలా మిస్ అవుతాను. ఈరోజు వీధుల్లో చూసిన దృశ్యం ఎప్పటికీ మర్చిపోలేను.

జస్ప్రీత్ బుమ్రా- నేను ఈ రోజు చూసింది, నేను ఇంతకు ముందు ఇలాంటివి చూడలేదు. ప్రస్తుతం పదవీ విరమణ చేయాలనే కోరిక నాకు లేదు. నా రిటైర్మెంట్ ఇంకా చాలా దూరంలో ఉంది. ఇది ప్రారంభం మాత్రమే.

మెరైన్ డ్రైవ్‌లో టీమిండియాకు ఘనస్వాగతం..

ముంబై ఎయిర్‌పోర్టు నుంచి మెరైన్‌డ్రైవ్‌కు టీమ్‌ఇండియా చేరుకున్నప్పుడు, గుమికూడిన జనాన్ని చూసి ఎవరైనా చలించిపోతారు. వాంఖడే స్టేడియానికి వెళ్లే మార్గంలో ఒకవైపు నీటి సముద్రం, మరో వైపు జనసంద్రం కనిపించింది. మెరైన్ డ్రైవ్‌లో వేలాది మంది ప్రజలు గుమిగూడారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు రోహిత్ శర్మ కుటుంబం కూడా వాంఖడే స్టేడియానికి చేరుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us