AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi: ఐపీఎల్ మెగా వేలంలోకి 13 ఏళ్ల కుర్రాడు.. ట్రాక్ రికార్డు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఇటీవలే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ విడుదల చేసిన వేలం జాబితాలో 13 ఏళ్ల ఓ క్రికెటర్ కూడా ఉన్నాడు. 13 ఏండ్ల బాలుడే గానీ అతన్ని ట్రాక్ రికార్డు చూస్తే మతిపోవాల్సిందే..

Vaibhav Suryavanshi: ఐపీఎల్ మెగా వేలంలోకి 13 ఏళ్ల కుర్రాడు.. ట్రాక్ రికార్డు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
Vaibhav Suryavanshi 13 Years Old In The Players List For The Ipl 2025 Mega Auction
Velpula Bharath Rao
|

Updated on: Nov 16, 2024 | 5:03 PM

Share

IPL 2025కి ముందు జరిగే మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. ఈసారి మొత్తం 1,574 మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న ఆటగాళ్లలో 1,165 మంది భారతీయులు, 409 మంది విదేశీయులు ఉన్నారు. ఇప్పుడు వేలంలో కనిపించనున్న 574 మంది ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ విడుదల చేసింది. అంటే ఇప్పటికే 1000 మంది ఆటగాళ్లు వేలం నుంచి తప్పుకున్నారు. వేలానికి ఎంపికైన 574 మంది ఆటగాళ్లలో 13 ఏళ్ల ఓ క్రికెటర్ కూడా ఉన్నాడు.

మెగా వేలంలోకి 13 ఏళ్ల ఆటగాడు

ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ విడుదల చేసిన వేలం జాబితాలో ఒకటి బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ పేరు కూడా ఉంది. వైభవ్ సూర్యవంశీకి ఇంకా 13 ఏళ్లు మాత్రమే. అతి చిన్న వయస్సులో అతను రంజీ ట్రోఫీ, హేమంత్ ట్రోఫీ, కూచ్ బెహార్ ట్రోఫీ మరియు వినూ మన్కడ్ ట్రోఫీలను ఆడాడు. తాజాగా భారత అండర్-19 జట్టులోకి కూడా ఎంపికయ్యాడు. వైభవ్ సూర్యవంశీ వివిధ టోర్నమెంట్‌లతో కలిపి ఏడాదిలో మొత్తం 49 సెంచరీలు సాధించాడు.

ఇది కూడా చదవండి: ఆసీస్‌కి ఆ టీమిండియా ప్లేయర్ అంటే దడ..ఎలాగైనా ఔట్ చేయాలని పెద్ద స్కెచ్..!

వైభవ్ సూర్యవంశీ ఎవరు?

వైభవ్ సూర్యవంశీ 5 సంవత్సరాల వయస్సులో క్రికెట్ నేర్చుకోవడం ప్రారంభించాడు. అతని తండ్రి సంజీవ్ ఐదేళ్ల వయస్సు నుండి వైభవ్‌ను నెట్ ప్రాక్టీస్ చేయించాడు. దీని కోసం అతని తండ్రి ఇంట్లో నెట్‌ను అమర్చాడు. రంజీ ట్రోఫీ చివరి సీజన్‌లో వైభవ్‌కు బీహార్‌ తరఫున అరంగేట్రం చేసే అవకాశం లభించింది. వైభవ్ తన మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ను కేవలం 12 సంవత్సరాల 284 రోజుల వయస్సులో ఆడాడు. అదే సమయంలో, అదే సంవత్సరంలో, బీహార్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన రణధీర్ వర్మ అండర్-19 ODI పోటీలో వైభవ్ సూర్యవంశీ కూడా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అండర్-19 టోర్నీ చరిత్రలో ఇదే తొలి ట్రిపుల్ సెంచరీ కూడా కావడం విశేషం. గత నెలలో ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుపై వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియాపై 64 బంతులు ఎదుర్కొని 104 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను కేవలం 58 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ  ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. దీంతో అండర్-19 టెస్టులో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు.

ఇది చదవండి: టీమిండియా ఫ్యాన్స్‌కు షాక్.. ఆ స్టార్ ప్లేయర్‌కి గాయం

కావ్య పాప వద్దంది.. కట్ చేస్తే..ఆ ప్లేయర్ కోసం క్యూ కడుతున్న ప్రాంఛైజీలు