
Fastest Double Century: వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించడం ఏ బ్యాట్స్మెన్కైనా ఒక భారీ రికార్డు. 50 ఓవర్ల మ్యాచ్లో 200 పరుగులు చేరుకోవడం అంటే మాములు విషయం కాదు. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించే విషయానికి వస్తే, కొంతమంది బ్యాటర్స్ అద్భుతాలు చేశారు. చాలా తక్కువ బంతుల్లోనే ఈ ఫిగర్ను చేరుకోవడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఈ జాబితాలో భారత ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. వన్డే క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన రికార్డును భారత కెప్టెన్ రోహిత్ శర్మ 3 సార్లు కలిగి ఉన్నాడు. వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన టాప్ 5 బ్యాట్స్మెన్లలో అతని పేరు లేకపోయినా, ఈ రికార్డ్ భారత బ్యాట్స్మన్ పేరిటే ఉండిపోయింది.
భారత యువ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన ప్రపంచ రికార్డును కలిగి ఉన్నాడు. డిసెంబర్ 2022లో బంగ్లాదేశ్పై కేవలం 126 బంతుల్లోనే అతను 200 పరుగులు సాధించాడు. ఇది అతని మొదటి వన్డే సెంచరీ, దీనిని అతను నేరుగా డబుల్ సెంచరీగా మార్చాడు.
రెండో స్థానంలో ఆసీస్ ప్లేయర్ర గ్లెన్ మాక్స్వెల్ ఉన్నాడు. 2023 ప్రపంచ కప్ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్పై అతను చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్లో గాయపడినప్పటికీ, మాక్స్వెల్ కేవలం 128 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించి, తన జట్టును ఓటమి నుంచి కాపాడి, విజయపథంలో నడిపించాడు.
శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక ఫిబ్రవరి 2024లో ఆఫ్ఘనిస్తాన్పై ఈ ఘనత సాధించాడు. కేవలం 136 బంతుల్లోనే 200 పరుగులు సాధించి, డబుల్ సెంచరీ చేసిన మూడవ అత్యంత వేగవంతమైన ఆటగాడిగా నిలిచాడు.
“యూనివర్స్ బాస్” గా పిలువబడే క్రిస్ గేల్ 2015 ప్రపంచ కప్లో జింబాబ్వేపై 138 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ప్రపంచ కప్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడు అతనే.
భారత విధ్వంసక ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ డిసెంబర్ 2011లో వెస్టిండీస్పై ఈ రికార్డును నెలకొల్పాడు. అతను కేవలం 140 బంతుల్లోనే 200 పరుగులు సాధించి, ఈ ఘనత సాధించిన రెండవ పురుష క్రికెటర్ అయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..