AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: లంకతో తలపడే భారత జట్టు ఇదే.. బిగ్ షాకిచ్చిన గంభీర్.. టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?

India vs Sri Lanka: శ్రీలంక టూర్‌కు భారత జట్టును ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్‌కు టీ20 కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. హార్దిక్ పాండ్యా ఇకపై టీ20 జట్టుకు వైస్ కెప్టెన్ కూడా కాలేడనేది షాకింగ్ న్యూస్. అతని స్థానంలో శుభ్‌మన్ గిల్‌కి ఈ బాధ్యతలు అప్పగించారు. శుభ్‌మన్ గిల్ వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు. వన్డే సిరీస్ గురించి మాట్లాడితే, రోహిత్ శర్మ కమాండ్ తీసుకుంటాడు.

IND vs SL: లంకతో తలపడే భారత జట్టు ఇదే.. బిగ్ షాకిచ్చిన గంభీర్.. టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
Team India
Venkata Chari
|

Updated on: Jul 18, 2024 | 8:01 PM

Share

India vs Sri Lanka: శ్రీలంక టూర్‌కు భారత జట్టును ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్‌కు టీ20 కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. హార్దిక్ పాండ్యా ఇకపై టీ20 జట్టుకు వైస్ కెప్టెన్ కూడా కాలేడనేది షాకింగ్ న్యూస్. అతని స్థానంలో శుభ్‌మన్ గిల్‌కి ఈ బాధ్యతలు అప్పగించారు. శుభ్‌మన్ గిల్ వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు. వన్డే సిరీస్ గురించి మాట్లాడితే, రోహిత్ శర్మ కమాండ్ తీసుకుంటాడు. వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ కూడా కనిపించనున్నాడు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమ్ ఇండియాకు ఇది తొలి సిరీస్.

భారత టీ20 జట్టు..

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్ మహ్మద్ సిరాజ్.

భారత వన్డే జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.

టీమ్ ఇండియా ఎంపిక గురించి కీలక విషయాలు..

టీ20 టీమ్‌కి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా ఇప్పుడు వైస్ కెప్టెన్ కూడా కాలేకపోయాడు.

శుభ్‌మన్ గిల్ వన్డే, టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ శ్రీలంకతో వన్డే సిరీస్‌లో ఆడనున్నారు.

రిషబ్ పంత్ ODI జట్టులోకి తిరిగి వచ్చాడు. అతను రెండు ఫార్మాట్లలో ఎంపికయ్యాడు.

రియాన్ పరాగ్‌కు టీ20, వన్డే సిరీస్‌లలో అవకాశం లభించింది.

శ్రేయాస్ అయ్యర్ వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు.

శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్‌లకు టీ20, వన్డే జట్టులో అవకాశం దక్కింది.

హర్షిత్ రాణాకు తొలిసారి వన్డే ఫార్మాట్‌లో అవకాశం దక్కింది.

వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్ వన్డే, టీ20 జట్లకు ఎంపికయ్యారు.

భారత్-శ్రీలంక టీ20-వన్డే సిరీస్ షెడ్యూల్..

టీమ్ ఇండియా శ్రీలంక పర్యటన జులై 27 నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ మొదటి 3 మ్యాచ్‌ల T20 సిరీస్ ఆడనుంది. రెండో టీ20 జులై 28న, మూడో టీ20 జులై 30న జరగనుంది. ఆ తర్వాత ఆగస్టు 2 నుంచి 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కూడా జరగనుంది. సిరీస్‌లోని తదుపరి మ్యాచ్‌లు ఆగస్టు 4, 7 తేదీల్లో జరగనున్నాయి. మొత్తం టూర్ కేవలం 2 వేదికలపైనే జరగనుంది. టీ20 సిరీస్ మ్యాచ్‌లు పల్లెకెలెలో జరగనుండగా, వన్డే సిరీస్ కొలంబోలో జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..