కోహ్లీ, రోహిత్‌ల బాటలోనే గిల్.. 37 సెంచరీల ప్లేయర్‌పై కక్ష కట్టిన టీమిండియా కెప్టెన్లు.. 4 ఏళ్లుగా మొండిచేయి

Team India Unlucky Cricketer: దేశీయ క్రికెట్‌లో 37 సెంచరీలు చేసిన ఓ టీమిండియా బ్యాట్స్‌మన్‌ 4 ఏళ్లుగా అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 27 సెంచరీలు, లిస్ట్-ఎ క్రికెట్‌లో 9 సెంచరీలు, టీ20 క్రికెట్‌లో 1 సెంచరీ చేశాడు. ఇలాంటి కెరీర్ ఉన్నప్పటికీ ఈ క్రికెటర్‌కు తీవ్ర అన్యాయం జరుగుతోంది.

కోహ్లీ, రోహిత్‌ల బాటలోనే గిల్.. 37 సెంచరీల ప్లేయర్‌పై కక్ష కట్టిన టీమిండియా కెప్టెన్లు.. 4 ఏళ్లుగా మొండిచేయి
Abhimanyu Easwaran

Updated on: Jul 27, 2025 | 6:18 PM

Team India Unlucky Cricketer: 2021 నుంచి టీం ఇండియాతో ఉన్న ఒక దురదృష్టవంతుడైన క్రికెటర్ ఉన్నాడు. గత 4 సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రికెటర్ సంవత్సరాలుగా బెంచ్‌లోనే కూర్చుంటున్నాడు. కానీ, అతనికి భారత జట్టు తరపున ఏ అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం రావడం లేదు. ఈ భారత బ్యాట్స్‌మన్ చాలా ప్రతిభావంతుడు. అతను దేశీయ క్రికెట్‌లో 37 సెంచరీలు చేశాడు. ఈ బ్యాట్స్‌మన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 27 సెంచరీలు, లిస్ట్-ఎ క్రికెట్‌లో 9 సెంచరీలు, టీ20 క్రికెట్‌లో 1 సెంచరీ చేశాడు. ఇలాంటి కెరీర్ ఉన్నప్పటికీ ఈ క్రికెటర్‌కు తీవ్ర అన్యాయం జరుగుతోంది.

4 సంవత్సరాలుగా అరంగేట్రం కోసం కష్టపడుతోన్న బ్యాడ్ లక్ ప్లేయర్..

ప్రతిభావంతుడైన బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ 2021 సంవత్సరంలో తొలిసారిగా టీమ్ ఇండియాలో చేరాడు. అప్పటి నుంచి, అభిమన్యు ఈశ్వరన్ ఖచ్చితంగా ఏదో ఒక టెస్ట్ సిరీస్‌లో భారత జట్టుతో చేరాడు. కానీ, గత 4 సంవత్సరాలుగా అతను అరంగేట్రం ఆశతో బెంచ్‌లో ఎదురుచూస్తున్నాడు. 2021 సంవత్సరంలో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు బ్యాకప్ ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్ తొలిసారిగా టెస్ట్ జట్టులో చేరాడు. ఈ పర్యటనలో అభిమన్యు ఈశ్వరన్ కేవలం పర్యాటకుడిగా మాత్రమే మిగిలిపోయాడు. అరంగేట్రం చేసే అవకాశం కూడా రాలేదు. ఆ సమయంలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ టీమిండియా మొదటి జాబితాలో ఉన్నారు. అంటే విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి యుగం నుంచే ఈ ప్లేయర్‌కు శని మొదలైంది.

37 సెంచరీలు సాధించిన దురదృష్టవంతుడైన క్రికెటర్..

37 సెంచరీలు సాధించిన ఈ దురదృష్టవంతుడైన క్రికెటర్‌కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ కెప్టెన్సీలో టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త టెస్ట్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ కూడా అభిమన్యు ఈశ్వరన్‌కు అన్యాయం చేస్తున్నాడు. డిసెంబర్ 2021 నుంచి ఇప్పటివరకు 16 మంది ఆటగాళ్ళు భారతదేశం తరపున టెస్ట్ అరంగేట్రం చేశారు. ఈ ఆటగాళ్లలో శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాష్ దీప్, దేవ్‌దత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, సాయి సుదర్శన్, అన్షుల్ కాంబోజ్ ఉన్నారు. కానీ, అభిమన్యు ఈశ్వరన్ ఇప్పటికీ అరంగేట్రం కోసం ఆరాటపడుతున్నాడు.

ఇవి కూడా చదవండి

అన్యాయానికి గురైన బాధితుడు..

అభిమన్యు ఈశ్వరన్‌కు అన్యాయాల పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సాయి సుదర్శన్‌కు స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్‌గా అరంగేట్రం చేసే అవకాశం లభించింది. కానీ, అభిమన్యు ఈశ్వరన్ గురించి ఎవరూ ఆలోచించలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత, ఇప్పుడు కొత్త టెస్ట్ కెప్టెన్ శుభ్ మాన్ గిల్ కూడా అభిమన్యు ఈశ్వరన్ ప్రతిభను గుర్తించలేకపోతున్నాడు. అభిమన్యు ఈశ్వరన్ 103 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 7841 పరుగులు చేశాడు. అభిమన్యు ఈశ్వరన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 27 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అభిమన్యు ఈశ్వరన్ అత్యుత్తమ స్కోరు 233 పరుగులు. అభిమన్యు ఈశ్వరన్ 89 లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో 3857 పరుగులు చేశాడు. అభిమన్యు ఈశ్వరన్ లిస్ట్-ఎ క్రికెట్‌లో 9 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో అభిమన్యు ఈశ్వరన్ అత్యుత్తమ స్కోరు 149 పరుగులు. ఇది కాకుండా, అభిమన్యు ఈశ్వరన్ 34 T20 మ్యాచ్‌ల్లో 976 పరుగులు చేశాడు. ఈ బ్యాట్స్‌మన్ T20 క్రికెట్‌లో 1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు సాధించాడు. T20 క్రికెట్‌లో అభిమన్యు ఈశ్వరన్ అత్యుత్తమ స్కోరు 107 నాటౌట్ పరుగులు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..