వామ్మో.. ఇదేం కొట్టుడు సామీ.. 50 ఓవర్లలో 17 ఫోర్లు, 45 సిక్సులు.. 506 పరుగులతో ప్రపంచ రికార్డునే బ్రేక్ చేసిన టీం..

విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో తమిళనాడు బ్యాట్స్‌మెన్ ఎన్ జగదీశన్ డబుల్ సెంచరీ, సాయి సుదర్శన్ సెంచరీ సాధించారు. అరుణాచల్ ప్రదేశ్‌పై జట్టు 506 పరుగులు చేసింది.

వామ్మో.. ఇదేం కొట్టుడు సామీ.. 50 ఓవర్లలో 17 ఫోర్లు, 45 సిక్సులు.. 506 పరుగులతో ప్రపంచ రికార్డునే బ్రేక్ చేసిన టీం..
Tamil Nadu Cricket Team Vijay Hazare Trophy

Updated on: Nov 21, 2022 | 4:15 PM

సోమవారం విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల తుఫాను కురిసింది. చిన్నస్వామి స్టేడియంలో అరుణాచల్ ప్రదేశ్‌పై తమిళనాడు జట్టు 506 పరుగులు చేసింది. లిస్ట్ ఏ క్రికెట్‌లో ఏ జట్టుకైనా ఇదే అత్యుత్తమ ప్రదర్శన. లిస్ట్ ఏ క్రికెట్‌లో ఓ జట్టు 500 మార్కును దాటడం ఇదే తొలిసారి. అరుణాచల్‌పై తమిళనాడు చేసిన 506 పరుగులు.. ఈ ఏడాది ప్రారంభంలో నెదర్లాండ్స్‌పై 498 పరుగులు చేసిన ఇంగ్లండ్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది.

ఇంగ్లండ్ కంటే ముందు సర్రే 2007లో గ్లౌసెస్టర్‌షైర్‌పై 496 పరుగులు చేసింది. అయితే ఇప్పుడు ఈ జట్లన్నీ ఓడించి తమిళనాడు ఈ రికార్డు సృష్టించింది.

ఈ మ్యాచ్‌లో ఎన్నో ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. తమిళనాడు ఓపెనర్ ఎన్ జగదీసన్ 277 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇది లిస్ట్ A క్రికెట్‌లో అతిపెద్ద ఇన్నింగ్స్. అంతేకాదు వరుసగా ఐదు సెంచరీలు బాది ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పాడు.

ఇవి కూడా చదవండి

సాయి సుదర్శన్‌తో కలిసి జగదీసన్ 416 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో తొలిసారిగా ఒక జంట 400 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని పంచుకుంది. సాయి సుదర్శన్ కూడా 154 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు కలిసి 17 సిక్స్‌లు, 44 ఫోర్లు కొట్టారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ జోడీ విరామం తర్వాత తమిళనాడు ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్ మాత్రమే ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..