Shivam Dube : మ్యాచ్ గెలిపించినా మందలింపు తప్పలేదు.. శివమ్ దుబేను కెప్టెన్ సూర్యకుమార్ ఎందుకు తిట్టాడు?
ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గవ టీ20 మ్యాచ్లో టీమ్ ఇండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్లో ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. ఈ విజయంలో ఆల్రౌండర్ శివమ్ దుబే కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్లో 22 పరుగులు చేయడంతో పాటు, బౌలింగ్లో రెండు కీలక వికెట్లు తీసి ఆసీస్ వెన్ను విరిచాడు.

Shivam Dube : ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గవ టీ20 మ్యాచ్లో టీమ్ ఇండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్లో ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. ఈ విజయంలో ఆల్రౌండర్ శివమ్ దుబే కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్లో 22 పరుగులు చేయడంతో పాటు, బౌలింగ్లో రెండు కీలక వికెట్లు తీసి ఆసీస్ వెన్ను విరిచాడు. అయితే, ఇంత మంచి ప్రదర్శన చేసినప్పటికీ దుబే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నుంచి బహిరంగంగానే తీవ్రమైన మందలింపు పొందాడు. దుబే ఎందుకు కెప్టెన్ ఆగ్రహానికి గురయ్యాడు.. మ్యాచ్లో భారత్ విజయం ఎలా సాధ్యమైంది అనే వివరాలు తెలుసుకుందాం.
భారత ఇన్నింగ్స్ బౌలింగ్లో 12వ ఓవర్లో శివమ్ దుబే ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ వికెట్ తీసుకున్నాడు. అయినప్పటికీ అతను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆగ్రహానికి గురయ్యాడు. అదే ఓవర్లోని ఆఖరి బంతికి మార్కస్ స్టోయినిస్ బౌండరీ కొట్టడానికి కారణం, దుబే ఫీల్డింగ్ సెటప్కు విరుద్ధంగా బౌలింగ్ చేయడమే. కెప్టెన్ సూచనలకు విరుద్ధంగా బంతిని వేయడంపై సూర్యకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
సూర్యకుమార్ మైదానంలోనే దుబే వైపు కోపంగా వచ్చి, గట్టిగా అరుస్తూ మందలించడం కెమెరాల్లో కనిపించింది. బౌలర్ వికెట్లు తీసినప్పటికీ, టీమ్ వ్యూహాన్ని పాటించకపోతే కెప్టెన్ ఎంత కఠినంగా ఉంటాడో ఈ సంఘటన నిరూపించింది. కెప్టెన్ మందలించినప్పటికీ శివమ్ దుబే బౌలింగ్ ప్రదర్శన భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. దుబే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో అత్యంత ప్రమాదకరంగా మారుతున్న ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్ వికెట్లను పడగొట్టాడు. ఈ రెండు వికెట్లు మ్యాచ్ను భారత్ వైపు తిప్పాయి.
Smart bowling, sharp catch! ⚡
A slower one from Dube and Arshdeep does the rest! #AUSvIND 👉 4th T20I | LIVE NOW 👉 https://t.co/HUqC93tuuG pic.twitter.com/8lGzHSbdbV
— Star Sports (@StarSportsIndia) November 6, 2025
బ్యాటింగ్లో కూడా దుబే 22 పరుగులు చేసి జట్టుకు సహకరించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 167 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా జట్టు 18.2 ఓవర్లలో కేవలం 119 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. శుభ్మన్ గిల్ (46), అభిషేక్ శర్మ (28), సూర్యకుమార్ యాదవ్ (20) పరుగులు చేశారు. చివర్లో అక్షర్ పటేల్ 11 బంతుల్లో 21 పరుగులతో అజేయంగా నిలవడం భారత్కు అదనపు బలం చేకూర్చింది.
బౌలింగ్లో టీమ్ ఇండియా సమష్టిగా రాణించింది. వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ 20 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. వరుణ్, బుమ్రా, అర్ష్దీప్లు చెరో వికెట్ పడగొట్టారు. బ్యాటింగ్, బౌలింగ్లో అద్భుత ప్రదర్శన చేసిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఫుల్ స్కోర్ బోర్డ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




