IND vs WI: అది చివరి ఎంపిక కావాలి.. ఆ నిర్ణయంపై సునీల్ గవాస్కర్ అసంతృప్తి..

వెస్టిండీస్‌తో బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన 2వ వన్డేలో ఓపెనింగ్ జోడీగా రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌ రావడం పట్ల భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సంతృప్తి చెందలేదు...

IND vs WI: అది చివరి ఎంపిక కావాలి.. ఆ నిర్ణయంపై సునీల్ గవాస్కర్ అసంతృప్తి..
Sunil Gavaskar

Updated on: Feb 10, 2022 | 11:36 AM

వెస్టిండీస్‌తో బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన 2వ వన్డేలో ఓపెనింగ్ జోడీగా రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌ రావడం పట్ల భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సంతృప్తి చెందలేదు. మిడిలార్డర్ బ్యాటింగ్‌లో ఉన్న పంత్‌తో కెప్టెన్ రోహిత్ బ్యాటింగ్‌ను ప్రారంభించడం ద్వారా అభిమానులను ఆశ్చర్యపరిచారు. అయితే జట్టుకు మంచి ప్రారంభాన్ని అందించడంలో విఫలమయ్యారు. రోహిత్ 5 పరుగుల వద్ద నిష్క్రమించగా, పంత్ 18 పరుగులు మాత్రమే చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 64 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవడంతో భారత్ 50 ఓవర్లలో 237 పరుగులు చేసింది.

మిడ్-మ్యాచ్ షోలో స్టార్ స్పోర్ట్స్‌లో గవాస్కర్ మాట్లాడుతూ రోహిత్, పంత్‌లను ఓపెనర్లుగా “చివరి ఎంపికగా” ఉపయోగించుకుంటానని చెప్పాడు. “నేను దానిని చివరి ఎంపికగా ఉంచుతాను. నా ఎంపిక (KL) రాహుల్ లేదా ఆర్డర్‌లో అగ్రస్థానంలో ఉన్న శిఖర్ ధావన్. లేదా ఆర్డర్‌లో అగ్రస్థానంలో మీకు ఎడమచేతి వాటం ఆటగాడు కావాలంటే, ఇషాన్ కిషన్‌ను తీసుంటా” అని చెప్పాడు. కోవిడ్-19 నుండి కోలుకున్న తర్వాత రుతురాజ్ గైక్వాడ్‌ను ప్రారంభ ఎంపికగా గవాస్కర్ పేర్కొన్నాడు. “ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉన్నాడు. పాపం కోవిడ్ కారణంగా అతను ఫిట్‌గా లేడు. అతను ఆర్డర్‌లో అగ్రస్థానంలో దోహదపడే వ్యక్తి. IPL గత రెండు సీజన్లలో అతని ఫామ్‌ను చూశాం.” అని గవాస్కర్ అన్నాడు.

Read Also.. IPL 2022: ఆ పేరు చాలా బాగుంది.. ఇది గర్వించదగిన క్షణం.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా

Loading...
Unable to load recommendations.
Follow Us