
England vs India, 2nd T20I: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లోని రెండో మ్యాచ్ మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అలాగే, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఉత్కంఠకు తెరదింపారు. రెండో మ్యాచ్లో బరిలోకి దిగనున్నాడు ఈ 15 ఏళ్ల టీమిండియా సెన్సేషన్. తన డెబ్యూ క్యాప్ను తిలక్ వర్మ నుంచి అందుకున్న వైభవ్.. ఎట్టకేవలకు రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. మొదటి మ్యాచ్ లాగే, ఈ మ్యాచ్లో కూడా వర్షం అంతరాయం కలిగించవచ్చు. వాతావరణ శాఖ ప్రకారం, వర్షం పడే అవకాశం 55% ఉంది. ఈ సిరీస్లోని మొదటి మ్యాచ్ కూడా వర్షం కారణంగా డ్రాగా ముగిసింది.
రెండో టీ20 కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ జట్టులోకి తిరిగి రాగా, జోష్ టంగ్ తన టీ20 అరంగేట్రం చేయనున్నాడు. సాకిబ్ మహమూద్, ల్యూక్ వుడ్ల స్థానంలో ఈ ఇద్దరు ఆటగాళ్లను తీసుకున్నారు.
భారత్, ఇంగ్లాండ్ ఇప్పటివరకు 31 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాయి. వీటిలో భారత్ 18 మ్యాచ్లు గెలవగా, ఇంగ్లాండ్ 12 మ్యాచ్లు గెలుచుకుంది, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ రెండు జట్లు ఇంగ్లాండ్లో 10 మ్యాచ్లు ఆడగా, వాటిలో ఇంగ్లాండ్ ఐదింటిలో, భారత్ నాలుగింటిలో గెలుపొందాయి. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు తొమ్మిది టీ20 సిరీస్లు జరిగాయి. వీటిలో భారత్ ఐదింటిలో, ఇంగ్లండ్ మూడింటిలో విజయం సాధించగా, ఒక సిరీస్ డ్రాగా ముగిసింది. భారత్ వరుసగా గత ఐదు టీ20 సిరీస్లలో ఇంగ్లండ్ను ఓడించింది.