AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11 సిక్సర్లు, 16 ఫోర్లు.. ఆ బ్యాట్స్‌మన్‌తో కలిసి 177 పరుగులు బాదిన సంజు శాంసన్.. అగార్కర్‌కు ఇచ్చిపడేశాడుగా

SMAT 2025: సంజు శాంసన్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అద్భుతమైన అర్ధ సెంచరీతో ప్రారంభించాడు. కానీ, అతని సహచరుడు రోహన్ కున్నుమ్మల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. మొదటి మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ కూడా గోవా తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగడం గమనార్హం.

11 సిక్సర్లు, 16 ఫోర్లు.. ఆ బ్యాట్స్‌మన్‌తో కలిసి 177 పరుగులు బాదిన సంజు శాంసన్.. అగార్కర్‌కు ఇచ్చిపడేశాడుగా
Sanju Samson
Venkata Chari
|

Updated on: Nov 27, 2025 | 7:46 AM

Share

Syed Mushtaq Ali Trophy 2025: సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో, సంజు శాంసన్, రోహన్ కున్నుమ్మల్ ఒడిశా బౌలర్లను చిత్తు చేశారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ 16.3 ఓవర్లలో 177 పరుగులు చేసి, తమ జట్టును 10 వికెట్ల విజయానికి నడిపించారు. ఇంతలో, గోవా తరపున ఆడుతున్న అర్జున్ టెండూల్కర్ కూడా తన మొదటి మ్యాచ్‌ను ఓపెనర్‌గా ఆడి తుఫాన్ బ్యాటింగ్‌తో 28 పరుగులు చేశాడు. అయినప్పటికీ అతని జట్టు ఓడిపోయింది.

రోహన్ కున్నుమ్మల్ – సంజు శాంసన్‌ల తుఫాన్ ఇన్నింగ్స్..

లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన ఒడిశా 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. సంజు శాంసన్ అజేయంగా 51 పరుగులు చేయగా, అతని సహచరుడు రోహన్ కున్నుమ్మల్ అద్భుతమైన సెంచరీ సాధించి, కేవలం 60 బంతుల్లో 121 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రోహన్ 201.67 స్ట్రైక్ రేట్‌తో కేవలం సిక్సర్లు, ఫోర్ల ద్వారా 100 పరుగులు చేశాడు. రోహన్, శాంసన్ కలిసి 16 ఫోర్లు, 11 సిక్సర్లు బాదారు. కేరళ 99 బంతుల్లోనే మ్యాచ్‌ను గెలుచుకుంది. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం సాధించిన రికార్డును కూడా రోహన్, సంజు సృష్టించారు.

ఓపెనర్‌గా అర్జున్ టెండూల్కర్..

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గోవా జట్టు 172 పరుగులు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గోవా 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. అర్జున్‌ను ఓపెనర్‌గా పంపి భువనేశ్వర్ కుమార్‌ను అద్భుతంగా ఎదుర్కొన్నాడు. అర్జున్, అభినవ్ తేజ్రానా హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అర్జున్ 28 పరుగుల వద్ద ఔటయ్యాడు. అభినవ్ 35 బంతుల్లో 72 పరుగులు చేసి ఆరు సిక్సర్లు బాదాడు. 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఉత్తరప్రదేశ్‌కు కష్టం కాదు. వికెట్ కీపర్ ఆర్యన్ జుయాల్ 57 బంతుల్లో అజేయంగా 93 పరుగులు చేశాడు. సమీర్ రిజ్వి 38 పరుగులు చేసి ఉత్తరప్రదేశ్‌కు విజయాన్ని అందించాడు. రింకు సింగ్ కేవలం నాలుగు పరుగులకే ఔటయ్యాడు. ఉత్తరప్రదేశ్ 10 బంతుల ముందుగానే మ్యాచ్‌ను గెలిచింది.

ఇవి కూడా చదవండి

ఉర్విల్ పటేల్ విజృంభణ..

గుజరాత్ వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్, కెప్టెన్ ఉర్విల్ పటేల్ కూడా తన సత్తా చాటాడు. కేవలం 31 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఉర్విల్ టీ20 క్రికెట్‌లో రెండవ వేగవంతమైన సెంచరీ సాధించాడు. 28 బంతుల్లోనే సెంచరీ సాధించిన రికార్డును కూడా కలిగి ఉన్నాడు. ఉర్విల్ తన ఇన్నింగ్స్ లో 10 సిక్సర్లు, 12 ఫోర్లు బాదాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..