AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇదేందిరయ్యా.. ఇలా చేశారు.. ఒక్క బంతికి 7 పరుగులు.. వైరలవుతోన్న పాకిస్తాన్ చెత్త ఫీల్డింగ్‌..

PAK vs AUS: ఆస్ట్రేలియాతో పాక్ జట్టు మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. కానీ, అంతకు ముందు, మసూద్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో 4 రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. అందులో మూడు రోజులు పూర్తయ్యాయి. ఈ మ్యాచ్‌లో, పాక్ ఫీల్డర్లు తమ చెత్త ఫీల్డింగ్‌తో పెద్ద పొరపాటు చేశారు. దీని కారణంగా ఒక బంతికి 7 పరుగులు వచ్చాయి. ఈ బ్యాడ్ ఫీల్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Video: ఇదేందిరయ్యా.. ఇలా చేశారు.. ఒక్క బంతికి 7 పరుగులు.. వైరలవుతోన్న పాకిస్తాన్ చెత్త ఫీల్డింగ్‌..
Aus Vs Pak Viral Video
Venkata Chari
|

Updated on: Dec 09, 2023 | 10:55 AM

Share

Pakistan Fielders: పాకిస్తాన్ క్రికెట్ జట్టు వారి పేలవమైన ఫీల్డింగ్‌తో తరచుగా సోషల్ మీడియాలో వైరలవుతుంటారు. అయితే, తీరు మారని పాక్ ఆటగాళ్లు మరోసారి అలాంటి తప్పిదం చేశారు. దీంతో సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నారు. ఈ పేలవమైన ఫీల్డింగ్ కారణంగా పాకిస్తాన్ ఆటగాళ్లు ఒక బంతికి 7 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. షాన్ మసూద్ సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది.

ఆస్ట్రేలియాతో పాక్ జట్టు మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. కానీ, అంతకు ముందు, మసూద్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో 4 రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. అందులో మూడు రోజులు పూర్తయ్యాయి. ఈ మ్యాచ్‌లో, పాక్ ఫీల్డర్లు తమ చెత్త ఫీల్డింగ్‌తో పెద్ద పొరపాటు చేశారు. దీని కారణంగా ఒక బంతికి 7 పరుగులు వచ్చాయి. ఈ బ్యాడ్ ఫీల్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ మాథ్యూ రెన్‌షా లాంగ్ ఆఫ్ దిశగా కొట్టిన బంతిని పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ బౌలింగ్ చేయడం వీడియోలో చూడవచ్చు. ఆ బంతికి రెన్షా మూడు పరుగులు పూర్తి చేసి తన యాభైని పూర్తి చేశాడు. పాక్ ఫీల్డర్ బౌండరీకి ​​ముందు బంతిని ఆపి బౌలింగ్ వైపు విసిరాడు. కానీ, ఆ తర్వాత, బౌలింగ్ ఎండ్‌లో బంతిని పట్టుకున్న తర్వాత, బాబర్ ఆజం బంతిని కీపర్ వైపు బలంగా విసిరాడు. అక్కడ నుంచి బంతి నేరుగా బౌండరీ లైన్ వైపు వెళుతుంది. ఈ విధంగా ఒక బంతికి 7 పరుగులు చేస్తారు.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ 24 పరుగుల వెనుకంజలో..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 391 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ప్రైమ్‌మినిస్టర్స్ ఎలెవన్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 367 పరుగులు చేసింది. దీంతో ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ 24 పరుగుల వెనుకంజలో ఉంది. ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ రెన్‌షా 136 పరుగుల వద్ద ఉన్నాడు. అతనితో పాటు బ్యూ వెబ్‌స్టర్ 21 పరుగులతో నాటౌట్‌గా వెనుదిరిగాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..