T20 World Cup 2024: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..

Pakistan Cricket Team: 2010, 2014లో జరిగిన ఆసియా క్రీడల్లో రెండుసార్లు స్వర్ణ పతకం సాధించిన మహిళల జట్టులో మరూఫ్ ఉండటం గమనార్హం. ఆమె మహిళల ODI ప్రపంచ కప్ నాలుగు ఎడిషన్లలో (2009, 2013, 2017, 2022) పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించింది. అదే సమయంలో న్యూజిలాండ్‌లో జరిగిన 2022 ఎడిషన్‌లో జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది.

T20 World Cup 2024: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
Bismah Maroof

Updated on: Apr 25, 2024 | 5:26 PM

Bismah Maroof Retirement: టీ20 ప్రపంచకప్ 2024కి ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ బిస్మా మరూఫ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆమె నిర్ణయం షాకింగ్‌గా ఉంది. దీని కారణంగా, బంగ్లాదేశ్‌లో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌నకు ముందు జట్టు బ్యాటింగ్, అనుభవంలో ముందు బలహీనంగా మారుతుంది.

2006లో పాకిస్థాన్ తరపున అరంగేట్రం చేసిన బిస్మా మరూఫ్.. అద్భుతమైన కెరీర్‌ను కలిగి ఉంది. వన్డేలు, T20లలో జట్టుకు అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌గా నిలిచింది. మరూఫ్ ODI ఫార్మాట్‌లో 136 మ్యాచ్‌లు ఆడి 3369 పరుగులు చేసింది. ఇందులో 21 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో ఆమె టీ20లో 140 మ్యాచ్‌లలో 2893 పరుగులు చేసింది. ఈ సమయంలో ఆమె 12 అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లు కూడా ఆడింది. మరూఫ్ లెగ్ బ్రేక్ బౌలర్‌గా వన్డేల్లో 44 వికెట్లు, టీ20ల్లో 36 వికెట్లు పడగొట్టింది.

బిస్మా 96 మ్యాచ్‌లకు పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది. ఈ కాలంలో 62 టీ20ల్లో 27 విజయాలు, 34 వన్డేల్లో 16 విజయాలు సాధించింది. టీ20ల్లో, మరూఫ్ కంటే సనా మీర్ (65) మాత్రమే ఎక్కువ కెప్టెన్సీ క్యాప్‌లను కలిగి ఉంది. వన్డేల్లో ఆమె మీర్ (72), షైజా ఖాన్ (39) తర్వాత జాబితాలో మూడో స్థానంలో ఉంది.

పదవీ విరమణ గురించి బిస్మా మరూఫ్ ఏమి చెప్పారంటే?

32 ఏళ్ల ఆటగాడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో ఒక గమనికను పంచుకుంది. దీని ద్వారా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించింది. తన నోట్‌లో ఆమె క్రికెట్ ప్రయాణంతో పాటు తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. అదే సమయంలో, ఆమె లీగ్ క్రికెట్‌కు అందుబాటులో ఉంటుందని కూడా పేర్కొంది.

2010, 2014లో జరిగిన ఆసియా క్రీడల్లో రెండుసార్లు స్వర్ణ పతకం సాధించిన మహిళల జట్టులో మరూఫ్ ఉండటం గమనార్హం. ఆమె మహిళల ODI ప్రపంచ కప్ నాలుగు ఎడిషన్లలో (2009, 2013, 2017, 2022) పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించింది. అదే సమయంలో న్యూజిలాండ్‌లో జరిగిన 2022 ఎడిషన్‌లో జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది. మరూఫ్ T20 ప్రపంచ కప్ ఎనిమిది ఎడిషన్లలో (2009, 2010, 2012, 2014, 2016, 2018, 2020, 2023) పాల్గొన్నాడు. వరుసగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో జరిగిన 2020, 2023 ఎడిషన్లలో జట్టుకు నాయకత్వం వహించింది.

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తన అనుభవజ్ఞుడైన ఆటగాడిని కచ్చితంగా కోల్పోనుంది. మరూఫ్ ఇటీవలి ఫామ్ అంత బాగా లేదు. కానీ, ఆమె తన అనుభవంతో ఖచ్చితంగా ఒక ముఖ్యమైన పాత్ర పోషించగలదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us