T-20 World Cup: సెమీస్ కు చేరిన భారత్.. సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. పసి కూనే అనుకుంటే..

|

Nov 06, 2022 | 12:07 PM

టీ20 ప్రపంచం కప్‌లో టీమిండియాకు సెమీస్ బెర్త్ ఖాయమైంది. నెదర్లాండ్స్ - సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో సంచలనం నమోదైంది. దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించడంతో భారత్..

T-20 World Cup: సెమీస్ కు చేరిన భారత్.. సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. పసి కూనే అనుకుంటే..
Netherlands
Follow us on

టీ20 ప్రపంచం కప్‌లో టీమిండియాకు సెమీస్ బెర్త్ ఖాయమైంది. నెదర్లాండ్స్ – సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో సంచలనం నమోదైంది. దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించడంతో భారత్ సెమీస్ మార్గం సుగమమైంది. దీంతో టీమిండియా పాయింట్ల పట్టికలలో మొదటి స్థానానికి చేరుకుంది. అయితే.. భారత్ ఇవాళ జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే 8 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలుపుకుంటుంది. ఒకవేళ పరాజయం పొందినా సెమీస్ చేరే విషయంలో పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. మరో మ్యాచ్ లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు ఆడనున్నాయి. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిచినా డైరెక్ట్ గా సెమీస్ కు చేరుకుంటుంది. ఓడిపోతే మాత్రం నెట్ రన్ రేట్ పై ఫలితం ఆధారపడుతుంది. దీంతో సెమీస్‌లో టీమిండియా ఇంగ్లండ్‌తో తలపడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కాగా.. నెదర్లాండ్స్ – పాకిస్తాన్ మ్యాచ్ లో సంచలనం నమోదైంది. పసికూనగా మంచి బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉన్న సౌతాఫ్రికాకు నెదర్లాండ్స్ షాకిచ్చింది. ఏకంగా 13 పరుగుల తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేసి 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌కు వెళ్లే మార్గం కష్టతరమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి