Video: ఆర్‌సీబీ డ్రెస్సింగ్ రూంలో ధోని హల్‌చల్.. ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే.. వైరల్ వీడియో

MS Dhoni in RCB Dressing Room Video: శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం సీఎస్‌కే ఇప్పటికే సిలికాన్ సిటీకి వచ్చి ప్రాక్టీస్ ప్రారంభించింది. ఇంతలో ఎంఎస్ ధోని అకస్మాత్తుగా చిన్నస్వామిలోని ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్‌లో కనిపించి, ఆశ్యర్యపరిచాడు.

Video: ఆర్‌సీబీ డ్రెస్సింగ్ రూంలో ధోని హల్‌చల్.. ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే.. వైరల్ వీడియో
Ms Dhoni In Rcb Dressing Ro

Updated on: May 17, 2024 | 11:29 AM

MS Dhoni in RCB Dressing Room Video: ఐపీఎల్ 2024 (IPL 2024)లో అతిపెద్ద మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (RCB vs CSK) మధ్య శనివారం (మే 18) జరగనుంది. రెండు జట్లు ప్లే ఆఫ్ రేసులో ఉన్నాయి. ఈ మ్యాచ్ నాకౌట్‌గా పరిగణిస్తున్నారు. అంతేకాకుండా, CSK వర్సెస్ RCB మధ్య పోటీ కాకుండా, భారతదేశపు అతిపెద్ద క్రికెట్ స్టార్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ కూడా ఒకరితో ఒకరు తలపడనున్నారు. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మ్యాచ్‌కు ముందు బెంగళూరు డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీ సందడి చేస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆర్‌సీబీతో మ్యాచ్ కోసం ధోనీతో సహా మొత్తం సీఎస్‌కే జట్టు బెంగళూరుకు చేరుకుంది. ఇప్పుడు ధోనీ స్వాగతానికి సంబంధించిన వీడియోను RCB షేర్ చేసింది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి టీ అడుగుతున్న దృశ్యాన్ని చూడవచ్చు. ధోనీకి టీపై ఉన్న ఈ ప్రేమ, సింప్లిసిటీని చూసి డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న RCB సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ధోనికి ఒక కప్పు టీ అందించారు.

ఇవి కూడా చదవండి

మహేంద్ర సింగ్ ధోని టీ ప్రియుడని అందరికీ తెలిసిందే. గతంలో చాలా ఇంటర్వ్యూలలో టీపై తనకున్న ఇష్టాన్ని ధోని ప్రస్తావించాడు. ధోనీకి సంబంధించిన ఈ వీడియో చూసిన కోహ్లీ, ధోనీ అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. మళ్లీ మైదానంలో ధోనీ, విరాట్‌లను చూడాలని ఎదురుచూస్తున్నానని చెప్పాడు.

RCB డ్రెస్సింగ్ రూమ్‌లో ధోని వీడియో..

ఈ కీలక మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్‌లోకి ప్రవేశించాలని ఆర్‌సీబీ జట్టు ఉవ్విళ్లూరుతోంది. విరాట్ కోహ్లీ 661 పరుగులతో మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే, ఈ మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించే అవకాశం కూడా ఉంది. బెంగళూరులో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మ్యాచ్ జరిగే రోజు మధ్యాహ్నం కూడా పిడుగులు పడే అవకాశం ఉంది. సాయంత్రం వేళ ఉష్ణోగ్రతలు దాదాపు 23 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతాయి. 100 శాతం మబ్బులు ఉంటాయి. వర్షం పడే అవకాశం 47 శాతం ఉంది. రాత్రి సమయంలో పిడుగులు పడే అవకాశం 60 శాతానికి పైగా ఉంటుంది. అంటే ఆర్‌సీబీ-సీఎస్‌కే మధ్య మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడం దాదాపు ఖాయమైనట్లేనని తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us