MS Dhoni: ధోనీ అభిమానులకు గుడ్‎న్యూస్‎.. మళ్లీ తండ్రి కాబోతున్న మహీ!..

|

Oct 16, 2021 | 4:50 PM

ఐపీఎల్2021​ ఫైనల్లో కోల్‎​కతా నైట్​రైడర్స్‎​ను ఓడించి విజేతగా చెన్నై సూపర్​ కింగ్స్ నిలిచింది. ధోనీ నేతృత్వంలోని జట్టు నాలుగో సారి టైటిల్ కైవసం చేసుకుంది. ధోనీకి ఎదురు లేదంటూ అతడి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ ఫైనల్ గెలుపును ఆస్వాదిస్తున్న మహీ అభిమానులకు...

MS Dhoni: ధోనీ అభిమానులకు గుడ్‎న్యూస్‎.. మళ్లీ తండ్రి కాబోతున్న మహీ!..
Sakshi
Follow us on

ఐపీఎల్2021​ ఫైనల్లో కోల్‎​కతా నైట్​రైడర్స్‎​ను ఓడించి విజేతగా చెన్నై సూపర్​ కింగ్స్ నిలిచింది. ధోనీ నేతృత్వంలోని జట్టు నాలుగో సారి టైటిల్ కైవసం చేసుకుంది. ధోనీకి ఎదురు లేదంటూ అతడి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ ఫైనల్ గెలుపును ఆస్వాదిస్తున్న మహీ అభిమానులకు సీఎస్‎కే బ్యాట్స్‎మెన్ సురేష్ రైనా భార్య ప్రియాంక మరో గుడ్ న్యూస్ చెప్పినట్లు సమాచారం. . ధోని మళ్లీ తండ్రి కాబోతున్నాడని ఆమె తెలిపారని వార్తలు వస్తున్నాయి. మహీ భార్య సాక్షి ప్రస్తుతం నాలుగు నెలల గర్భంతో ఉందని ప్రియాంక వెల్లడించారని తెలుస్తోంది.

దీంతో నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా ధోనీకి కంగ్రాట్స్ చెబుతున్నారు. ధోనీ సాక్షి 2010లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2015లో వీరికి జీవా సింగ్ జన్మించింది. జీవా అంటే మహీకి చాలా ఇష్టం. ఖాళీ దొరికినప్పుడల్లా జీవాతో సరదాగా గడుపుతుంటాడు. జీవాతో ఉన్న వీడియోలు, ఫొటోలను సాక్షి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అయితే ధోని మళ్లీ తండ్రి కాబోతున్నట్లు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఐపీఎల్ ఫైనల్లో చెన్నై గెలిచిన తర్వాత సాక్షి, జీవా ధోని వద్దకు వచ్చారు. వారిని ధోని కౌగిలించుకుని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ధోనీ టీ 20 ప్రపంచ కప్‎లో భారత జట్టకు మెంటర్‎గా పని చేయనున్నారు. అతను ఈ సేవలకు ఎలాంటి డబ్బు తీసుకోవడంలేదని బీసీసీఐ గతంలోనే తెలిపింది. టీ20 ప్రపంచ కప్ రేపటి నుంచి యూఏఈ, ఒమన్‎లో ప్రారంభం కానుంది. కాగా అక్టోబర్ 24న భారత్ పాక్‎తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

Read Also..MS Dhoni-Ziva: విన్నింగ్ మూమెంట్‎ను భార్య, కూతురితో కలిసి ఎంజాయ్ చేసిన ధోనీ.. వైరల్‌‎గా మారిన వీడియో..