
Ishan Kishan Double Century: చెన్నైలోని ఎం.చిదంబరం స్టేడియంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్తో దక్షిణ జోన్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. 111 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన అతడు.. చివరకు 250 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్ చేరాడు.
ఇషాన్ కిషన్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తుండగా మహ్మద్ సిరాజ్ బౌన్సర్లతో పరీక్షించాడు. బౌండరీలు బాదిన కిషన్, సిరాజ్ మధ్య మాటల మార్పిడి జరిగింది. ఇద్దరూ ముఖాముఖిగా నిలిచిన సమయంలో సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాడు. అయితే ఈ ఘటన స్నేహపూర్వక వాతావరణంలోనే సాగినట్లుగా కనిపించింది.
ఈస్ట్ జోన్ తొలుత వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్తో మంచి ఆరంభం అందుకుంది. తొలి వికెట్కు 100 పరుగులు జోడించారు. ఈశ్వరన్ 86 బంతుల్లో 72 పరుగులు చేయగా.. సూర్యవంశీ 44 పరుగులు సాధించాడు. అనంతరం శిఖర్ మోహన్ 85 పరుగులతో కీలక సహకారం అందించాడు.
🚨 FUNNY CONVERSATION BETWEEN TILAK VERMA, MOHAMMED SIRAJ & ISHAN KISHAN 🚨
Tilak Verma Said 🗣️: You’ve been playing for a long time. You don’t need to play anymore. Stop now. 😭
Mohammed Siraj Said 🗣️: Hey Ishan, stop now! How much longer are you going to play? You’ve made me… pic.twitter.com/7kMNJYVGXZ
— lndian Sports Network (@IS_Netwrk29) September 7, 2026
250 పరుగులతో ఇషాన్ కిషన్ దులీప్ ట్రోఫీ ఫైనల్లో 200కుపైగా స్కోరు చేసిన ఏడో బ్యాటర్గా నిలిచాడు. అలాగే ఈస్ట్ జోన్ బ్యాటర్గా వృద్ధిమాన్ సాహా 2012లో చేసిన 170 పరుగుల రికార్డును అధిగమించాడు. వికెట్ కీపర్గా దినేశ్ కార్తీక్ 2010 ఫైనల్లో చేసిన 183 పరుగుల రికార్డునూ దాటాడు. ఫైనల్లో కెప్టెన్, వికెట్ కీపర్గా 200 దాటిన తొలి ఆటగాడిగానూ నిలిచాడు.
కిషన్ 250 పరుగుల ఇన్నింగ్స్లో 27 ఫోర్లు, 7 సిక్స్లు ఉన్నాయి. కుమార్ కుశాగ్ర 8 ఫోర్లు, 5 సిక్స్లతో 101 పరుగులు చేశాడు. అనుకూల్ రాయ్ 45 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లకు 620 పరుగుల మార్కును దాటింది. దక్షిణ జోన్ బౌలర్లలో త్రిపురాన విజయ్, చామ మిలింద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..