
ఈ ఐపీఎల్ సీజన్లో కొంతమంది ఆటగాళ్లు సూపర్ ఫామ్తో పరుగుల వరద పారిస్తున్నారు. అలా ఆడుతున్న వారిలో ఓ ప్లేయర్ తాజాగా ఓ మ్యాచ్కు దూరం అయ్యాడు. అతను మరెవరో కాదు ఆసీస్ ప్లేయర్ మిచెల్ మార్ష్. లక్నో సూపర్ జెయింట్స్కు ఆడుతూ.. భీకర బ్యాటింగ్తో మ్యాచ్ను వన్సైడ్ చేస్తున్న మార్ష్.. శనివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్కు దూరం అయ్యాడు. అతను లేకుండానే ఎల్ఎస్జీ బరిలోకి దిగుతోంది. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. వ్యక్తిగత కారణాలతో మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్ ఆడటం లేదని చెప్పాడు. అతని కూతురు అనారోగ్యానికి గురవ్వడంతో మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నాడని వెల్లడించాడు. ‘మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. చూడటానికి పిచ్ బాగుంది. గత రెండు మ్యాచ్లు గెలవడం హ్యాపీగా ఉంది. ఓ జట్టుగా మా ప్రాసెస్పై ఫోకస్ పెట్టాం. ప్రతీ ఆటగాడు అద్భుతంగా ఆడుతున్నాడు. బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. మా విజయాల క్రెడిట్ వారిదే.
ఈ మ్యాచ్కు మిచెల్ మార్ష్ దూరమయ్యాడు. అతని స్థానంలో హిమ్మత్ సింగ్ జట్టులోకి వచ్చాడు. మిచెల్ మార్ష్ కూతురు అనారోగ్యానికి గురైంది.’అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు. కాగా మిచెల్ మార్ష్ లేకపోవడం కచ్చితంగా లక్నోకు కాస్త ఇబ్బంది కరమైన అంశమే అని చెప్పాలి. ఎందుకంటే.. మార్ష్ సూపర్ బ్యాటింగ్తో లక్నోకు మంచి స్టార్ట్ ఇస్తున్నాడు. మరి అతను లేకపోతే.. లక్నో పవర్ ప్లేలో ఎలా ఆడుతుందో చూడాలి.
MITCHELL MARSH IS NOT PLAYING TODAY…!!!! [His daughter is unwell] pic.twitter.com/H3l6aHsP3H
— Johns. (@CricCrazyJohns) April 12, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..