IND vs WI: వెస్టిండీస్‌ను ఓడించలేకపోతే ఐపీఎల్ కాంట్రాక్టులు ఇవ్వొద్దు: టీమిండియా మాజీ ప్లేయర్..

Manoj Tiwary IPL contract remark: భారత్, వెస్టిండీస్ జట్టు సెమీస్ స్థానం కోసం పోటీపడుతున్నాయి. అయితే, అంతకుముందు టీమిండియా మాజీ ప్లేయర్ మనోజ్ తివారి టీమిండియా ప్లేయర్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. విండీస్ జట్టును ఓడించకపోతే ఐపీఎల్ కాంట్రాక్ట్‌లు ఇవ్వొద్దంటూ చెప్పుకొచ్చాడు.

IND vs WI: వెస్టిండీస్‌ను ఓడించలేకపోతే ఐపీఎల్ కాంట్రాక్టులు ఇవ్వొద్దు: టీమిండియా మాజీ ప్లేయర్..
Team India

Updated on: Mar 01, 2026 | 8:03 PM

టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ ఆదివారం వెస్టిండీస్‌తో వర్చువల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతోంది. ఇది సూపర్ 8 దశలో భాగమైనప్పటికీ, అసలు ప్రాధాన్యం మాత్రం సెమీఫైనల్ టికెట్‌పైనే నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి బయటపడుతుంది. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన ఇరు జట్లు రెండు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. జింబాబ్వేపై భారీ విజయాలు సాధించినప్పటికీ, దక్షిణాఫ్రికాతో ఓటమి చవిచూశాయి.

మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు..

మాజీ భారత బ్యాటర్ మనోజ్ తివారీ సరదాగా కానీ కీలక వ్యాఖ్యలు చేశాడు. “భారత్ గత మ్యాచ్‌లో 256 పరుగులు చేసింది. ఆ స్థాయి నుంచి చూస్తే, వెస్టిండీస్‌పై ఎలాంటి ఒత్తిడి లేకుండా 200కి పైగా స్కోర్ చేసి సులభంగా గెలవాలి. వెస్టిండీస్‌ను ఓడించలేకపోతే, ఎవరికీ IPL కాంట్రాక్టులు ఇవ్వొద్దు” అని క్రిక్‌బజ్ చర్చలో తివారీ తెలిపాడు.

దక్షిణాఫ్రికాతో మొదటి సూపర్ 8 మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓడిన భారత్, జింబాబ్వేపై 256/4 భారీ స్కోర్ చేసి 72 పరుగుల తేడాతో గెలిచి బలంగా తిరిగి వచ్చింది.

వీరేంద్ర సెహ్వాగ్ భిన్నాభిప్రాయం..

అదే చర్చలో పాల్గొన్న మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం తివారీ అభిప్రాయానికి భిన్నంగా స్పందించాడు. “మనం అజేయులం కాదు. ఇతర జట్లు కూడా గెలవడానికి వస్తాయి. దక్షిణాఫ్రికాతో ఓ చెడు రోజు ఎదురైంది. జింబాబ్వేను ఓడించాం. ఇప్పుడు వెస్టిండీస్‌ను ఓడిస్తే నవ్వుతూ సెమీఫైనల్‌కు చేరతాం” అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

“మన దేశం చాలా భావోద్వేగంగా స్పందిస్తుంది. ఒకే ఓటమి తర్వాత ప్రపంచకప్ పోయినట్లుగా స్పందిస్తారు” అంటూ పేర్కొన్నాడు.

సెమీఫైనల్ సమీకరణ..

దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి భారత్‌కు కష్టాలు తెచ్చినా, దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌పై గెలవడంతో పరిస్థితి కొంత సులభమైంది.

ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. చివరి స్థానం కోసం భారత్, వెస్టిండీస్ పోటీ పడుతున్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో గెలిచే జట్టే చివరి నాలుగులో స్థానం సంపాదిస్తుంది.

సెమీస్ పోరు ఇలా..

తొలి సెమీస్ లో భాగంగా న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా జట్లు తపడనున్నాయి. ఇక రెండో మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టుతో తలపడే జట్టు ఏదో మరికొద్దిసేపట్లో తేలనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us