Manchester Test: నాలుగో టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్.. లేటెస్ట్ సెన్సేషన్లకు జట్టులో చోటు

మాంచెస్టర్‌లో జరగనున్న నాలుగో టెస్టు కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికపై ఆకాష్ చోప్రా తన సూచనలు చేశారు. ధ్రువ్ జురెల్, అన్షుల్ కంబోజ్‌లకు అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు. గాయాలతో ఉన్న ఆటగాళ్లు, రిషబ్ పంత్ పరిస్థితి వంటి అంశాలపై చోప్రా ఏమన్నారో తెలుసుకుందాం.

Manchester Test: నాలుగో టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్.. లేటెస్ట్ సెన్సేషన్లకు జట్టులో చోటు
Indias Playing Xi

Updated on: Jul 22, 2025 | 3:20 PM

Manchester Test: భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య నాలుగో టెస్టు మాంచెస్టర్‌లో జరగనుంది. జూలై 23న ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ను టీమిండియా గెలవడం చాలా ముఖ్యం, ఎందుకంటే టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే సిరీస్ చేజారుతుంది. కాబట్టి, ఈ మ్యాచ్ గెలవాలంటే బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా సిరీస్‌కు దూరమవడం, ఆకాష్ దీప్ మాంచెస్టర్‌లో ఆడే అవకాశం లేకపోవడంతో జట్టు సమతూకం దెబ్బతింది. మరి భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతుంది? ఈ ప్రశ్నకు మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సమాధానం ఇచ్చారు. అతని ప్రకారం ధ్రువ్ జురెల్, అన్షుల్ కంబోజ్ ఇద్దరూ మాంచెస్టర్ టెస్టులో ఆడాలి.

ఆకాష్ చోప్రా ప్రకారం, మాంచెస్టర్ టెస్టులో ధ్రువ్ జురెల్ ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చుకోవాలి. ఎందుకంటే రిషబ్ పంత్ వికెట్ కీపింగ్‌కు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పంత్ మాంచెస్టర్‌లో వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించినా, ముందు జాగ్రత్తగా అతనికి ఈ బాధ్యత నుంచి మినహాయింపు ఇవ్వవచ్చు. అప్పుడు పంత్ కేవలం స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా ఆడితే, వికెట్ కీపింగ్ బాధ్యతను జురెల్ నిర్వర్తించవచ్చు. జురెల్ బ్యాటింగ్‌లో కూడా సత్తా చూపించగలడు. అతను నితీష్ కుమార్ రెడ్డి లేని లోటును పూర్తి చేయగలడు.

గత రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆకాష్ దీప్ మాంచెస్టర్‌లో ఆడటం దాదాపు అసాధ్యం. సోమవారం మాంచెస్టర్‌లో అతను మెట్లు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడ్డాడట. ఇప్పుడు అన్షుల్ కంబోజ్ ను టీమిండియాలో చేర్చారు. ఆకాష్ చోప్రా ప్రకారం.. ఆకాష్ దీప్ స్థానంలో అన్షుల్ కంబోజ్‌కు అవకాశం ఇవ్వాలి. కంబోజ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఇంగ్లాండ్ పరిస్థితులు, పిచ్‌లు అతని బౌలింగ్ శైలికి సరిపోతాయి. అన్షుల్ కంబోజ్ బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇది టీమిండియాకు ప్రయోజనం చేకూర్చవచ్చు.

ఆకాష్ చోప్రా అంచనా ప్రకారం భారత్ ప్లేయింగ్ ఎలెవన్:
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అన్షుల్ కంబోజ్, మొహమ్మద్ సిరాజ్.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us