ధోని ఖాతాలో అరుదైన రికార్డు!

భారత్ జట్టు మాజీ సారధి మహేంద్రసింగ్ ధోని ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా తరపున అత్యధిక వన్డేలు ఆడిన రెండో ఆటగాడిగా ధోని రికార్డు సృష్టించాడు. 463 వన్డేలు ఆడి సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉండగా.. 340 వన్డేలతో ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న భారత్, పాక్ మ్యాచ్ ద్వారా ధోని తన ఇన్నింగ్స్‌లను 341కి పెంచుకుని.. రెండో స్థానం దక్కించుకున్నాడు. ఇకపోతే […]

ధోని ఖాతాలో అరుదైన రికార్డు!

Updated on: Jun 16, 2019 | 9:55 PM

భారత్ జట్టు మాజీ సారధి మహేంద్రసింగ్ ధోని ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా తరపున అత్యధిక వన్డేలు ఆడిన రెండో ఆటగాడిగా ధోని రికార్డు సృష్టించాడు. 463 వన్డేలు ఆడి సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉండగా.. 340 వన్డేలతో ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న భారత్, పాక్ మ్యాచ్ ద్వారా ధోని తన ఇన్నింగ్స్‌లను 341కి పెంచుకుని.. రెండో స్థానం దక్కించుకున్నాడు. ఇకపోతే ఈ మ్యాచ్‌లో ధోని కీలకమైన తరుణంలో బ్యాటింగ్‌కు దిగి కేవలం ఒక్క పరుగు చేసి పెవిలియన్‌కు చేరడంతో అభిమానులు నిరాశ చెందారు.

Loading...
Unable to load recommendations.
Follow Us