Ishan Kishan: ఇషాన్ కెరీర్‌కు చిచ్చు పెట్టిన కేబీసీ షో.. స్మృతితో కలిసి వేళ్లడమే కొంపముంచిందా.. ద్రవిడ్ ఏమన్నాడంటే?

|

Jan 10, 2024 | 9:06 PM

India Vs Afghanistan: ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో ఇషాన్ కిషన్‌కు చోటు దక్కలేదు. Cricbuzz నివేదిక ప్రకారం, BCCI ఇషాన్ కిషన్ పట్ల సంతోషంగా లేదని తెలుస్తోంది. డిసెంబర్ 2023లో దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో ఇషాన్ కిషన్ భారతదేశానికి తిరిగి వచ్చాడు. మానసిక అలసట కారణంగా BCCI నుంచి విరామం కోరాడు. ఇషాన్ కిషన్ కూడా తన కుటుంబంతో కొంత సమయం గడపాలని కోరాడు. ఆ తర్వాత దుబాయ్‌లో పార్టీ చేసుకుంటూ కనిపించాడు.

Ishan Kishan: ఇషాన్ కెరీర్‌కు చిచ్చు పెట్టిన కేబీసీ షో.. స్మృతితో కలిసి వేళ్లడమే కొంపముంచిందా.. ద్రవిడ్ ఏమన్నాడంటే?
Ishan Kishan Smriti Mandhan
Follow us on

Ishan Kishan KBC With Smriti Mandhana: ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో యువ వికెట్‌కీపర్‌ కం బ్యాట్స్‌మెన్‌ ఇషాన్‌ కిషన్‌కు అవకాశం రాలేదు. సెలక్టర్లు ఈ లెఫ్ట్ హ్యాండర్ స్థానంలో సంజూ శాంసన్, జితేష్ శర్మలను ఎంపిక చేశారు. దీనికి సంబంధించి ఇషాన్ కొంతకాలం క్రితం ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ అనే టీవీ షోలో కనిపించాడని, ఇది టీమ్ మేనేజ్‌మెంట్‌కు నచ్చలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి, అతను వ్యక్తిగత కారణాల వల్ల దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. టీవీ షోలో ఇషాన్‌తో పాటు భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన కూడా ఉంది. ఇప్పుడు దీనిపై భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రకటన చేశాడు.

రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే..

ఆఫ్ఘనిస్తాన్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు, భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో ఇషాన్ కిషన్ గురించి కూడా ప్రస్తావించాడు. ఈ సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతూ, ‘క్రమశిక్షణా కారణాలేవీ లేవు. ఎంపికకు ఇషాన్ అందుబాటులో లేడు. అతను దక్షిణాఫ్రికా పర్యటనలోనే విరామం కోరాడు. దానికి మేం అంగీకరించాం. ఇషాన్ ఎంపికకు అందుబాటులోకి రాలేదంటూ చెప్పుకొచ్చాడు.

ఇషాన్‌పై సెలక్టర్లు సంతోషంగా లేరా?

ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో ఇషాన్ కిషన్‌కు చోటు దక్కలేదు. Cricbuzz నివేదిక ప్రకారం, BCCI ఇషాన్ కిషన్ పట్ల సంతోషంగా లేదని తెలుస్తోంది. డిసెంబర్ 2023లో దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో ఇషాన్ కిషన్ భారతదేశానికి తిరిగి వచ్చాడు. మానసిక అలసట కారణంగా BCCI నుంచి విరామం కోరాడు. ఇషాన్ కిషన్ కూడా తన కుటుంబంతో కొంత సమయం గడపాలని కోరాడు. ఆ తర్వాత దుబాయ్‌లో పార్టీ చేసుకుంటూ కనిపించాడు. ఇది మాత్రమే కాదు, అతను మహిళా క్రికెటర్ స్మృతి మంధానతో కలిసి అమితాబ్ బచ్చన్ టీవీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో పాల్గొన్నాడు.

దుబాయ్‌లో కూడా..

ఇషాన్ కిషన్ కుటుంబంతో సమయం గడపడానికి విరామం అడిగారని, అయితే అతను దుబాయ్‌లో పార్టీ చేసుకుంటున్నాడని BCCI మూలాలను ఉటంకిస్తూ ఒక నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం, ‘ఇషాన్ కిషన్ మానసిక అలసట కారణంగా టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి విరామం కోరారు. అతను తన కుటుంబంతో కొంత సమయం గడపాలని అనుకున్నాడు. కానీ, అతను దుబాయ్ ట్రిప్‌కు వెళ్లే ఎంపికను ఎంచుకున్నాడు. ఇషాన్ కిషన్ దుబాయ్‌ పార్టీలో కనిపించాడు.

ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అవేశ్ ఖాన్ ముఖేష్ కుమార్, అర్ష్దీప్ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..