IPL 2024: కెప్టెన్గా హార్దిక్ వద్దే వద్దు.. ఏకమైన ముంబై టీమ్ ప్లేయర్లు.. ఫ్రాంఛైజీ కీలక నిర్ణయం!
గత రెండు ఎడిషన్లలో గుజరాత్ జట్టు కెప్టెన్గా జట్టును విజయవంతంగా నడిపించిన పాండ్యా.. ముంబై జట్టులోనూ జోష్ నింపుతాడని అందరూ భావించారు. అయితే ఈ ఎడిషన్ లో ముంబై జట్టు లీగ్ దశలోనే తన ప్రయాణాన్ని ముగించుకుంది.
నాలుగేళ్లలో రెండోసారి ఐపీఎల్ సీజన్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. 2022లో రోహిత్ శర్మ నాయకత్వంలో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా పరిస్థితి కూడా అదే. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం నుంచే ముంబై ఇండియన్స్ జట్టు వివాదాల్లో నిలుస్తోంది. ఇక వరుస పరాజయాలు ఆ జట్టు కెప్టెన్ పాండ్యా భవిష్యత్ ను గందరగోళంలో పడేశాయి. గత రెండు ఎడిషన్లలో గుజరాత్ జట్టు కెప్టెన్గా జట్టును విజయవంతంగా నడిపించిన పాండ్యా.. ముంబై జట్టులోనూ జోష్ నింపుతాడని అందరూ భావించారు. అయితే ఈ ఎడిషన్ లో ముంబై జట్టు లీగ్ దశలోనే తన ప్రయాణాన్ని ముగించుకుంది. దీంతో ఫ్రాంచైజీతో పాటు అభిమానులకు కూడా కోపం వచ్చింది. అంతే కాకుండా కెప్టెన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు జట్టులో చీలికకు కారణమైనట్లు సమాచారం.
సీనియర్ ప్లేయర్ల ఒక్కటయ్యారు!
ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటి వరకు 17 ఐపీఎల్ సీజన్లు ఆడింది. వీటిలో 5 సార్లు ఐపీఎల్ టైటిల్ను ఆ జట్టు గెలుచుకుంది. ఇంత బలమైన జట్టు ఇప్పుడు ఈ ఎడిషన్లో లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. నిజానికి ఈ సీజన్లో 12 మ్యాచ్లు ఆడిన ముంబై కేవలం 4 మ్యాచ్ల్లోనే 8 పాయింట్లు సాధించింది. నిన్నటి మ్యాచ్లో లక్నో SRHతో జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో ముంబై అధికారికంగా లీగ్కు దూరమైంది. జట్టులో చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ కనీసం ప్లే ఆఫ్ కు చేరుకోకపోవడంతో ముంబై యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా జట్టులోని సీనియర్ ఆటగాళ్లు జట్టు కోచింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా పాల్గొన్నారని వీరందరూ హార్దిక్ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేశారని జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. టోర్నీ ప్రారంభ మ్యాచ్ల నుండి, హార్దిక్ పాండ్యా అనేక నిర్ణయాలు నిరంతరం సందేహాస్పదంగా ఉన్నాయి. కొన్నిసార్లు జస్ప్రీత్ బుమ్రాను బౌలింగ్ చేయడానికి ఆలస్యంగా తీసుకురావడం, కొన్నిసార్లు బ్యాటింగ్ ఆర్డర్లో సరైన బ్యాట్స్మెన్ను సరైన సమయంలో పంపకపోవడం తరచుగా చర్చనీయాంశమైంది. అలాగే, మ్యాచ్ ఓటమి తర్వాత, హార్దిక్ యువ బ్యాట్స్మెన్ తిలక్ వర్మను బాధ్యుడిని చేసి మాట్లాడడం సీనియర్ ఆటగాళ్ల అసంతృప్తికి దారితీసింది.
హార్దిక్ కెప్టెన్సీ ఉండేనా?
హార్దిక్ నాయకత్వం కూడా ప్రమాదంలో పడినట్లే. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సీజన్ ముగిసిన తర్వాత కూడా జట్టు ప్రదర్శనపై చర్చ జరుగుతుందని, అవసరమైతే ఫ్రాంచైజీ జట్టు భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని నివేదిక పేర్కొంది. ఇప్పుడు పెద్ద నిర్ణయం ఏమిటన్నది మరికొద్ది నెలల్లో తేలిపోనుంది. ఏది ఏమైనా ఈ సీజన్ తర్వాత మెగా వేలం జరగాల్సి వస్తే రోహిత్ స్థానంలో మళ్లీ హార్దిక్ని కెప్టెన్గా తీసుకుంటారా లేక సూర్య, బుమ్రా వంటి వెటరన్లలో ఎవరినైనా ఎంపిక చేస్తారా లేక హార్దిక్కి మరో అవకాశం ఇస్తారా? అనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..